Mayawathi Clarity On Alliances :బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి (Former CM Of Uttar Pradesh Mayawati) సంచలన ప్రకటన చేశారు. దేశంలో లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ (బహుజన్ సమాజ్ పార్టీ) పూర్తి సన్నద్ధత, సొంత బలంతో పోరాడుతోందని ప్రకటించారు. అటువంటి పరిస్థితిలో ఎన్నికల కూటమి, మూడవ ఫ్రంట్ ఏర్పాటు గురించి పుకార్లు వ్యాప్తి చేయడం స్థూలమైన, తప్పుడు వార్తలు అని కొట్టి పడేశారు. ఈ మేరకు ఆమె "ఎక్స్" వేదికగా స్పందించారు. ఇలాంటి అబద్దపు వార్తలు ఇచ్చి మీడియా తన విశ్వసనీయత కోల్పోకూడదని హితవు పలికారు. ఈ విషయంలో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రత్యేకించి యూపీలో ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ప్రతిపక్షాలు చాలా అశాంతికి గురవుతున్నాయని అన్నారు.
గురుకుల నియామకాల్లో సరైన విధానం పాటించాలి - సీఎం రేవంత్రెడ్డికి ప్రవీణ్కుమార్ లేఖ
Former CM Of Uttar Pradesh Mayawati Announcement :అందుకే రోజూ రకరకాల పుకార్లు పుట్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారని ఆక్షేపించారు. అయితే బహుజన వర్గాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయాలని బీఎస్పీ నిర్ణయించిందని స్పష్టం చేశారు. "ఎక్స్"లో మాయావతి చేసిన పోస్టును బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్(RS Praveen Kumar) రీపోస్టు చేశారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు పెట్టుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో మాయావతి చేసిన ప్రకటనపై ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతర్మథనంలో పడిపోయింది. ఈ అంశంపై హైదరాబాద్లో అందుబాటులో ఉన్న ఆ పార్టీ ముఖ్య నాయకులతో ఆర్ఎస్పీ సమాలోచనలు జరిపారు.