తెలంగాణ

telangana

జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణకు హాజరైన క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లు - PC GHOSH COMMISSION INQUIRY UPDATES

By ETV Bharat Telangana Team

Published : 6 hours ago

PC Ghosh Commission Inquiry Update : కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. ఈ మేరకు ఇవాళ కమిషన్ ముందు క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజినీర్లు హాజరయ్యారు. అఫిడవిట్ల ఆధారంగా ఇంజినీర్ల క్రాస్ ఎగ్జామినేషన్ విచారణ జరుగుతోంది.

PC Ghosh Commission Investigations Updates
PC Ghosh Commission Inquiry Update (ETV Bharat)

PC Ghosh Commission Investigations Updates : కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజినీర్లు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ చేస్తున్న కమిషన్, క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ కొనసాగిస్తోంది. అందులో భాగంగా ఇవాళ క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజినీర్ల క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నారు. గతంలో వారు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఆనకట్టల నిర్మాణ పనుల్లో నాణ్యత, నిర్మాణ సమయంలో నాణ్యతా తనిఖీలు, సంబంధిత అంశాలపై జస్టిస్ ఘోష్ వారిని ప్రశ్నిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details