తెలంగాణ

telangana

ETV Bharat / state

దిల్‌ రాజు ఆఫీస్​లో కొనసాగుతున్న ఐటీ రైడ్స్ - ఐదో రోజు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం - IT RAIDS ON DIL RAJU HOUSE

దిల్‌ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో నాలుగో రోజూ కొనసాగుతున్న తనిఖీలు - కీలక పత్రాలు పరిశీలన

IT Raids on Producer Dil Raju Concluded
IT Raids on Producer Dil Raju Concluded (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2025, 8:52 AM IST

Updated : Jan 24, 2025, 9:24 PM IST

IT Raids on Producer Dil Raju House : సినీ పరిశ్రమలోని అగ్ర నిర్మాణ సంస్థలపై ఐటీ అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా నాలుగు రోజుల నుంచి ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థపై ఐటీ అధికారులు తనిఖీలు చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్​ ఎమ్మెల్యే కాలనీలోని దిల్ రాజు నివాసంలో తనిఖీలు ముగించిన ఐటీ అధికారులు, తమ వాహనంలోనే దిల్​ రాజును సాగర్ సొసైటీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు.

ఆదాయ పన్ను చెల్లింపులో వ్యత్యాసాలు! : సినిమాల ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపులకు సంబంధించిన డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానం ఉన్న వివరాలపై అక్కడే ఉన్న దిల్ రాజుతోపాటు అతని సోదరుడు శిరీష్, ఇతర ముఖ్య సిబ్బందిని ఆరా తీస్తున్నారు. నాలుగేళ్ల నుంచి ఆదాయ పన్ను చెల్లింపులో వ్యత్యాసాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులు అడిగే అన్ని వివరాలకు దిల్ రాజు సమాధానం ఇస్తూ ఎలాంటి ఆందోళన లేకుండా కనిపిస్తున్నారు.

ఐదో రోజు కూడా సోదాలు :అటు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో కూడా సోదాలు ఆగడం లేదు. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థగా పేరున్న మైత్రీలో పెట్టుబడులు, ఆదాయ వ్యయాలతో పాటు ప్రతి సినిమాకు పన్ను చెల్లింపులపై సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. అనుమానం ఉన్న వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఐదో రోజు కూడా ఈ సోదాలు కొనసాగేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

సినీ ప్రముఖుల కార్యాలయాల్లో మూడో రోజూ ఐటీ దాడులు - దిల్ రాజు తల్లికి తీవ్ర అస్వస్థత

Last Updated : Jan 24, 2025, 9:24 PM IST

ABOUT THE AUTHOR

...view details