తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆయన ఇల్లు ఓ నాణేల మ్యూజియం - మీరు ఇప్పటివరకు చూడనివి, మీకు తెలియనివి ఆయన వద్ద ఎన్నో! - Yadagiri Collect old Coins Stamps

Collection of Old Coins : వృత్తి రీత్యా లైబ్రేరియన్ అయిన ఆ వ్యక్తి వివిధ రకాల కాయిన్స్, స్టాంప్​లు సేకరించారు. కాలం గడుస్తున్న కొద్దీ దాన్నే వ్యసనంగా మార్చుకుని పురాతన కాలపు నాణేలు, స్టాంప్​లు సేకరించడమే కాకుండా ఇతర దేశాల కరెన్సీ కూడా భద్రపరుస్తున్నాడు. సుమారు 150 దేశాలకు పైగా చెందిన కరెన్సీని సేకరించి అబ్బురపరుస్తున్నాడు. ఇంతకీ ఎవరినేగా ఆలోచిస్తున్నారు. అతనే మెదక్ జిల్లాకు చెందిన జీడిమెట్ల యాదగిరి. అతని కథ ఏంటో తెలుసుకుందాం.

Yadagiri Collect old Coins and Stamps
Collection of Stamps India

By ETV Bharat Telangana Team

Published : Feb 18, 2024, 7:21 PM IST

మీరు ఇప్పిటి వరకు చూడని కాయిన్స్, స్టాంప్స్ అతని దగ్గరే ఉన్నాయి ఓ సారి చూసేయండీ!

Collection of Old Coins: 26 సంవత్సరాలుగా నాణేలు, స్టాంప్​లు ఎక్కడ దొరికినా, అవి సేకరించి భద్రపరుస్తున్నాడు. ఈ క్రమంలో కొంత మంది అతడిని పిచ్చోడని హేళన చేసినా పట్టించుకోలేదు. ఇలా సేకరించడంలోనే ఆనందాన్ని వెతుక్కున్నాడు. దీనికి ఫలితంగా అతని దగ్గర ప్రస్తుతం టిప్పు సుల్తాన్ నాణేలు, సంఘ సంస్కర్తలు స్టాంప్​లు(Old Stamps), ఇతర దేశాల కరెన్సీ, ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి. వాటిని చూస్తే వావ్ అనాల్సిందే. అతను ఎవరో కాదు మెదక్ జిల్లాలోని నర్సాపూర్​కు చెందిన జీడిమెట్ల యాదగిరి.

యాదగిరి 1997లో తూప్రాన్‌‌ లైబ్రరీలో రికార్డు అసిస్టెంట్‌‌గా ఉద్యోగంలో చేరి, ఆ తర్వాత ప్రమోషన్‌‌ మీద మెదక్ వచ్చాడు. అక్కడ వివిధ దిన పత్రికలు, మ్యాగజైన్​లు చదువుతుండగా భిన్నంగా ఉండే కాయిన్‌‌లు, కరెన్సీ నోట్లు సేకరించిన వారి గురించి ప్రచురితమయ్యే వార్తలు చూసి అతనికీ అలాంటివి సేకరించాలనే ఆసక్తి ఏర్పడింది.

సాయి భక్తులకు గుడ్​న్యూస్​- బంగారు, వెండి కాయిన్స్​ తయారీ- భక్తులిచ్చిన కానుకలతోనే!

Yadagiri Collect old Coins and Stamps: ఉద్యోగరీత్యా ప్రతి రోజు ఆర్టీసీ బస్సులో నర్సాపూర్‌‌ నుంచి తూప్రాన్​కు వెళ్లే క్రమంలో టికెట్‌‌ తీసుకునేటప్పుడు కండక్టర్‌‌ ఇచ్చే చిల్లర నాణేలను ఇంట్లో దాచడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ల తర్వాత వాటిని పరిశీలిస్తే, చాలా వరకు వెరైటీ కాయిన్స్‌‌ లభించాయి. ఆ రోజు నుంచి ఆయన కాయిన్స్​ను సేకరించడాన్ని అలవాటుగా మార్చుకున్నాడు. తన స్నేహితులు, తోటి ఉద్యోగులు, బంధువులు, తెలిసిన వారి వద్ద ఏదైనా నాణెం కొత్తగా అనిపిస్తే, దాని విలువకు తగిన డబ్బు ఇచ్చి వాటిని తీసుకునేవాడు. దీంతో అతణ్ని పిచ్చివాడు అనుకునే వారని యాదగిరి వాపోయాడు. పురాతన కాలం నాటి, భిన్నంగా ఉన్న కాయిన్స్​ హైదరాబాద్​లోని జుమ్మెరాత్‌‌ బజార్‌‌, చార్మినార్‌‌, ఎర్రగడ్డ ప్రాంతాల్లో అమ్ముతారనే విషయం తెలిసి, అక్కడికి వెళ్లి కొనుక్కొని వచ్చేవాడు. తనకు కావాల్సిన నాణెం కోసం డబ్బుకు వెనకాడకుండా వారు అడిగినంత ఇచ్చి దానిని తీసుకునేవాడు.

చిల్లర నాణేలతో నామినేషన్‌కు వచ్చిన జహీరాబాద్ బీఎంపీ అభ్యర్థి, నిరాకరించిన రిటర్నింగ్ ఆఫీసర్

టిప్పుసుల్తాన్ కాయిన్స్ చూశారా: యాదగిరి వద్ద పురాతనకాలం నాటి కాయిన్స్​తో పాటు జాతీయ నాయకులు, సంఘ సంస్కర్తలు, వివిధ రంగాల ప్రముఖుల బొమ్మలతో ఉన్న నాణెేలు ఉన్నాయి. పురాతన కాలం నాటి పంచింగ్‌‌కాయిన్స్‌‌తో పాటు, రామటెంకీలు, తూటు పైసలు, టిప్పు సుల్తాన్ కాలం, ట్రావెన్‌‌ కోర్‌‌ దేవస్థానం నాటి, స్వాతంత్య్రం రాక ముందు బ్రిటీష్‌‌ పాలనా కాలంలో విక్టోరియా రాణి బొమ్మతో వెలువడిన నాణేలు, నవాబుల కాలం నాటి నాణేలు(NAVABs Coins) ఇలా ఎన్నో ఉన్నాయి.

"గాంధీజీ, భగత్‌‌సింగ్‌‌, సుకుదేవ్, మదర్ థెరిసా వంటి ప్రముఖుల చిత్రాలతో ఉన్న స్టాంపులతో పాటు, దాదాపు 100 దేశాలకు చెందిన స్టాంపులను సేకరించాను. మండలాల్లో ప్రదర్శనలు, వివిధ సందర్భాల్లో నా వద్ద ఉన్న నాణేలు, కరెన్సీ నోట్లు, పోస్టల్‌‌ స్టాంపుల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాను. భవిష్యత్తులో జిల్లాలోని ప్రతి మండలంలో నాణేలు, కరెన్సీ, స్టాంపుల ప్రదర్శనలు ఏర్పాటు చేసి వాటి గొప్పదనాన్ని ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు, యువకులకు వివరిస్తాను." - యాదగిరి, నాణేలను సేకరించిన వ్యక్తి

Jailer Gold Coins : 'జైలర్' సక్సెస్ సెలబ్రేషన్స్.. 300 మందికి గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్​.. బిర్యానీ పెట్టించి మరీ

100 దేశాలకు పైగా కరెన్సీ సేకరణ: మన దేశంలో వివిధ కాలాల్లో వినియోగంలో ఉన్న ఒకటి, రెండు, మూడు అణా పైసలు, చారాణ, ఆటాణా, 5, 10, 20, 50 పైసలు, రూపాయి చిక్కలు, 5, 10 రూపాయల నాణేలు సేకరించారు. జాతీయ నాయకుల జన్మ దినోత్సవాలు, వివిధ ప్రత్యేక సందర్భాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాణేలుఆయన వద్ద ఉన్నాయి. 1 నుంచి 100 వరకు కరెన్సీ నోట్లు (Old Notes) పాతవి, కొత్తవి సేకరించారు. 1, 2, 5, 10, 20, 50, 100 కరెన్సీ నోట్లతో పాటు సుమారు 25 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు యాదగిరి సేకరించడం విశేషం. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం మూడు స్టాంపులు రిలీజ్‌‌ చేయగా, అవి యాదగిరి వద్ద ఉండటం మరో విశేషం.

ప్రత్యేక ఆకర్షణగా రామాయణాన్ని వివరించే నాణేలు

ABOUT THE AUTHOR

...view details