తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌ కేసు - ఏ1గా కేటీఆర్‌ - KTR ACCUSED A1 IN E CAR RACING CASE

ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌పై ఏసీబీ కేసు నమోదు - ఫార్ములా ఈ కార్‌ రేసులో ఏ1గా కేటీఆర్‌ - స్పందించిన మాజీ మంత్రి - అన్ని వాస్తవాలు వివరిస్తానని స్పష్టం

KTR Accused as A1 in Formula E car Racing Case
KTR Accused as A1 in Formula E car Racing Case (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 19, 2024, 4:34 PM IST

Updated : Dec 19, 2024, 5:27 PM IST

KTR Accused as A1 in Formula E car Racing Case :ఫార్ములా ఈ-కార్ రేసింగ్​పై ఏసీబీ విచారణ మొదలైంది. రేసింగ్​లో అవకతవకలపై కేసు నమోదు చేసింది. ఇందులో ఏ1గా అప్పటి మున్సిపల్ శాఖా మంత్రి, బీఆర్​ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, ఏ2గా ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌ కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి పేర్లను చేర్చింది. త్వరలోనే ఈ కేసు విచారణ నిమిత్తం ఏసీబీ వీరికి నోటీసులు జారీ చేసే అవకాశముంది.

ఆర్బీఐ అనుమతి లేకుండానే చెల్లింపులు : ఈ వ్యవహారంలో కేటీఆర్‌పై విచారణ జరిపేందుకు గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ ఇటీవలే ప్రభుత్వానికి అనుమతి మంజూరు చేశారు. గవర్నర్‌ అనుమతితో సర్కారు తదుపరి చర్యలకు ఉపక్రమించింది. సోమవారం కేబినెట్ సమావేశంలో నిర్ణయం మేరకు ఈ-కార్ రేసింగ్​పై విచారణ చేపట్టాలని ఏసీబీకి మంగళవారం సీఎస్‌ శాంతికుమారి లేఖ రాశారు. ఈ-కార్‌ రేసింగ్‌లో వివాదాస్పదంగా మారిన విదేశీ సంస్థకు నగదు చెల్లింపులపై ప్రధానంగా దర్యాప్తు జరగనుంది. హెచ్‌ఎండీఏ బోర్డు, ఆర్థికశాఖ, ఆర్బీఐ అనుమతి లేకుండానే రూ.55 కోట్ల చెల్లింపులు జరిగాయి. వీటిలోనూ రూ.46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన అభియోగం. విదేశీ సంస్థకు నగదు చెల్లింపులపై ఏసీబీ దర్యాప్తు చేయనుంది.

ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌పై 2022 అక్టోబరు 25న కుదిరిన ఒప్పందం కుదిరింది. ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌, ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌, పురపాలక శాఖలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 9, 10, 11, 12వ సీజన్ల కార్‌ రేస్‌లు హైదరాబాద్​లో నిర్వహించేలా ఒప్పందం కుదిరింది. 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్‌రోడ్‌లో తొమ్మిదో సీజన్‌ రేసింగ్‌ నిర్వహించారు.

నిబంధనలు విరుద్ధంగా అనుమతులు ఎవరిచ్చారు :ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన ఏసీబీ తన విచారణలోనిబంధనలకు విరుద్ధంగా ఈ-రేసింగ్​కు నిధుల చెల్లింపునకు అనుమతులు ఎవరు ఇచ్చారు?, నిధులు ఎక్కడికి చేరాయి?, ఎవరెవరి చేతులు మారాయో? దర్యాప్తు చేయనుంది.

అన్ని వాస్తవాలు వివరిస్తా :కాగా ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్ కేసు నమోదుపై మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ-కార్‌ రేసులో కుంభకోణం జరిగిందని అంటున్నారని, కావాలంటే దీనిపై శుక్రవారం శాసనసభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. తాను సభలో అన్ని వాస్తవాలు వివరిస్తానని ప్రభుత్వానికి దమ్ముంటే చర్చ పెట్టాలని సవాల్ విసిరారు.

కేటీఆర్ అరెస్టుపై నేనేమీ చెప్పలేను - చట్టం తన పని తాను చేస్తుంది : మంత్రి పొంగులేటి

Last Updated : Dec 19, 2024, 5:27 PM IST

ABOUT THE AUTHOR

...view details