తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jul 4, 2024, 9:46 AM IST

Updated : Jul 4, 2024, 10:06 AM IST

ETV Bharat / sports

డ్రమ్​ బీట్​కు అదిరే​ స్టెప్పులు- రోడ్డుపై రోహిత్​ డ్యాన్స్​- వీడియో చూశారా​? - T20 World Cup 2024

Rohit Sharma Dance: ప్రపంచకప్ నెగ్గిన టీమ్ఇండియా జట్టు గురువారం దిల్లీకి చేరుకుంది. స్వదేశానికి చేరుకున్న ప్లేయర్లందరికీ ఘన స్వాగతం లభించింది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఇతర ఆటగాళ్లు స్టెప్పులేశారు. ఈ వీడియోలు వైరల్​గా మారాయి.

Rohit Sharma Dance
Rohit Sharma Dance (Source: ANI)

Rohit Sharma Dance: టీ20 వరల్డ్​కప్ విజేత టీమ్ఇండియా గురువారం స్వదేశానికి చేరుకుంది. గురువారం ఉదయం 7 గంటలకు ప్లేయర్లంతా దిల్లీ ఎయిర్ పోర్ట్​కు చేరుకున్నారు. విశ్వ వేదికపై భారత్​ను విజేతగా నిలిపిన ఛాంపియన్లకు క్రికెట్ ఫ్యాన్స్​ ఘన స్వాగతం పలికారు. ఇక ప్రత్యేక బస్సులో అక్కడ్నుంచి టీమ్ఇండియా ప్లేయర్లంతా దిల్లీ ఐటీసీ మౌర్య హోటల్​కు వెళ్లారు.హోటల్ వద్ద కూడా ప్లేయర్లకు గ్రాండ్​ వెల్​కమ్ లభించింది.

బ్యాండ్ చప్పుళ్లు, సంప్రదాయ నృత్యాలతో టీమ్ఇండియాకు హోటల్ సిబ్బంది స్వాగతం పలికింది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ సంబరాలు రెట్టింపు అయ్యాయి. బస్సు దిగి హోటల్​కు నడుస్తున్న క్రమంలో రోహిత్ బ్యాండ్ చప్పుళ్లకు స్టెప్పులేశాడు. కాసేపు హుషారుగా డ్యాన్స్ చేస్తూ అక్కడున్న వారందరిలో జోష్ నింపాడు. ఇక సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్​ కూడా డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

అంతేకాకుండా హోటల్ సిబ్బంది ప్రత్యేకంగా టీ20 వరల్డ్​కప్ నమూనాలో ఓ కేక్ తయారు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య ఈ కేక్​ కట్ చేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. ఇక మోదీతో భేటీ ముగిశాక టీమ్ఇండియా ముంబయి వెళ్లనుంది. ఇవాళ సాయంత్రం ముంబయిలో రోడ్ షో ఉండనుంది. ఈ క్రమంలో రోడ్​ షో కోసం ఓ బస్సును బీసీసీఐ ప్రత్యేకంగా డిజైన్ చేయించింది. ఓపెన్‌ టాప్‌ బస్సుపై టీమ్ఇండియా ప్లేయర్లు రోడ్‌ షోలో పాల్గొననున్నారు. ముంబయి నారిమన్ పాయింట్ వద్ద ర్యాలీ ప్రారంభమై వాంఖడే స్టేడియం వద్ద ముగస్తుంది.

ర్యాలీ డిస్టెన్స్ దాదాపు 2కిలోమీటర్లు ఉండనుంది. ఈ రోడ్ షోకు భారీ ఎత్తున ఫ్యాన్స్ హాజరయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ర్యాలీ అనంతరం బీసీసీఐ ఆధ్వర్యంలో వాంఖడే స్టేడియంలో ప్లేయర్లకు సన్మాన కార్యక్రమం ఉంటుంది.

టీమ్ఇండియా 'రోడ్ షో' బస్సు రెడీ- వీడియో వైరల్- డిజైన్ అదిరిపోయిందిగా! - T20 World Cup 2024

వరల్డ్​ ఛాంపియన్లు వచ్చేశారోచ్- ఎయిర్​పోర్ట్​లో ప్లేయర్లకు గ్రాండ్ వెల్​కమ్ - T20 World Cup

Last Updated : Jul 4, 2024, 10:06 AM IST

ABOUT THE AUTHOR

...view details