తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్ 'డబుల్ ధమాకా'కు 11ఏళ్లు- ఆసీస్​పై ఆ ఇన్నింగ్స్​ ఎప్పటికీ స్పెషలే! - ROHIT SHARMA FIRST DOUBLE CENTURY

రోహిత్ శర్మ ఫస్ట్ డబుల్ సెంచరీకి 11ఏళ్లు పూర్తి- ఆసీస్​పై ఆ ఇన్నింగ్స్​ ఎప్పటికీ ప్రత్యేకమే

Rohit Sharma Double Century
Rohit Sharma Double Century (Source: Getty Images)

By ETV Bharat Sports Team

Published : Nov 2, 2024, 3:07 PM IST

Rohit Sharma First Double Century :టీమ్ఇండియా స్టార్ రోహిత్ శర్మ వన్డే చరిత్రలో మూడు సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్​గా కొనసాగుతున్నాడు. ఇప్పటికీ మరే ఇతర క్రికెటర్ ఈ రికార్డు దరిదాపుల్లోకి కూడా చేరలేదు. అయితే, 2013లో సరిగ్గా ఇదే రోజున (నవంబర్ 2న) ఈ ఘనతను రోహిత్​ తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే?

సచిన్, సెహ్వాగ్‌ లాంటి దిగ్గజాలు ద్విశతకాలు సాధించిన ప్లేయర్లుగా కొనసాగుతున్న సమయంలో సరిగ్గా 11 ఏళ్ల కిందట రోహిత్ తన వన్డే కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీని బాదాడు. ఈ ఘనతతో అప్పుట్లోనే ఆ లెజెండ్స్​ సరసన చేరిన రోహిత్, ఇప్పుడు ప్రపంచ వన్డే క్రికెట్‌లోనే అత్యధిక డబుల్‌ సెంచరీలు తన ఖాతాలో వేసుకున్న బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. అద్భుతమైన బౌలింగ్‌ స్కిల్స్ కలిగిన ఆస్ట్రేలియాపై ద్విశతకం (209: 158 బంతుల్లో 12 ఫోర్లు, 16 సిక్స్‌లు) చేయడం అనేది క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేని ఓ రేర్ ఫీట్.

ఇంతకీ ఆ మ్యాచ్ ఎలా సాగిందంటే?
భారత్‌ పర్యటనలో భాగంగా 2013లో ఆస్ట్రేలియా జట్టు ఇండియాకు వచ్చింది. ఇక్కడ ఇరు జట్లు ఏడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ కోసం తలపడ్డాయి. అయితే అందులో ఏకైక టీ20తో పాటు వన్డే సిరీస్‌ను మాత్రమే టీమ్‌ఇండియా కైవసం చేసుకుంది. తొలి, మూడో వన్డేలతో ఆసీస్‌ ఆధిపత్యం చలాయించగా, రెండో, ఆరో వన్డే మ్యాచ్‌ల్లో మాత్రం భారత్‌ విజయ పరంపర కొనసాగించింది. ఓ రెండు మ్యాచ్‌లు మాత్రం వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దైపోయాయి. దీంతో చివరి (ఏడో వన్డే) మ్యాచ్‌ ఫలితం ఇరు జట్లకు కీలకంగా మారింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 383 పరుగులను స్కోర్ చేసింది. ఆ తర్వాత క్రీజులోకి దిగిన ఆసీస్‌ జట్టు 326 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది.

ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ (209) శిఖర్ ధావన్ (60)తో కలిసి తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం సాధించాడు. అయితే స్వల్ప వ్యవధిలోనే ధావన్‌తో పాటు విరాట్ కోహ్లీ (0) పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సురేశ్‌ రైనా (28), యువరాజ్‌ (12)తో కలిసి రోహిత్ స్వల్ప భాగస్వామ్యాలు నిర్మించాడు. 207 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి డీలా పడ్డ భారత ఇన్నింగ్స్‌ను ఎంఎస్ ధోనీ (62)తో కలిసి రోహిత్ ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌ సమయానికి 167 పరుగులు జోడించారు.

ఈ క్రమంలోనే రోహిత్ డబుల్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. 114 బాల్స్​లోనే తొలి సెంచరీ పూర్తి చేసిన రోహిత్, రెండో సెంచరీని మాత్రం కేవలం 44 బంతుల్లోనే సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో ధోనీ, రోహిత్ పెలియన్ చేరుకున్నారు.

ఇక ఆ తర్వాత భారత్​ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేధించేందుకు దిగిన ఆసీస్‌ ప్లేయర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో ఆ జట్టు టాప్‌ ఆర్డర్‌ విఫలం కాగా, మిడిలార్డర్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ (60), షేన్ వాట్సన్‌ (49)తో కలిసి జేమ్స్ ఫాల్కనెర్ (116) తన జట్టును గెలిపించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేశారు. కానీ షమీ (3), జడేజా (3), అశ్విన్ (2), వినయ్‌కుమార్‌ ఓ వికెట్ తీశారు.

మూడు డబుల్ సెంచరీలు ఎప్పుడెప్పుడంటే?
వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన రోహిత్ శర్మ ఈ ఘనత వల్ల టాప్‌ స్కోరర్​గానూ చరిత్రకెక్కాడు. 2014 నవంబర్ 13న శ్రీలంకపై జరిగిన మ్యాచ్​లో 264 పరుగులు స్కోర్ చేశాడు. ఇప్పటికీ ఇదే అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. అయితే రోహిత్ తర్వాత ఈ లిస్ట్​లో మార్టిన్ గప్తిల్ (237) రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక 2017లో మళ్లీ శ్రీలంకపైనే 208 పరుగులతో అజేయంగా నిలిచాడు.

'రోహిత్​ను ముంబయి కెప్టెన్​గా చేయాలి - MI మేనేజ్​మెంట్ అతడ్ని మర్యాదపూర్వకంగా అడగాలి'

బుమ్రా, సూర్యకుమార్​ కంటే తక్కువ వాల్యూ - రోహిత్ ఏమన్నాడంటే?

ABOUT THE AUTHOR

...view details