తెలంగాణ

telangana

ETV Bharat / sports

2019 వరల్డ్‌ కప్‌లో అతడి బదులు ధోనీ బ్యాటింగ్​కు వచ్చుంటే బాగున్ను: రోహిత్ శర్మ - Rohit Sharma 2019 World Cup

Rohit Sharma 2019 World Cup : 2019 వరల్డ్‌ కప్​లో సెమీస్​లో ఘోర పరజాయాన్ని చవి చూసింది టీమ్ఇండియా. అయితే ఆ సమయంలో 'నాలుగో స్థానం' ఎవరదనే విషయంపై తీవ్ర చర్చే సాగింది. కానీ రోహిత్​కు మాత్రం ధోనీ '4'వ ప్లేస్‌లో రావాలని అనిపించినట్లు వెల్లడించాడు.

By ETV Bharat Sports Team

Published : Aug 25, 2024, 1:34 PM IST

Rohit Sharma 2019 World Cup
MS Dhoni, Rohit Sharma (Getty Images)

Rohit Sharma 2019 World Cup : 2019 వరల్డ్ కప్​ ఎడిషన్​ను భారత అభిమానులకు ఓ మర్చిపోలేని గాయంలాంటిదని అంటుంటారు. ఎంతో ఉత్సాహంగా ఆడతూ వచ్చిన టీమ్ఇండియాకు సెమీస్‌లో బ్రేక్ పడింది. ఆ ఓటమి కారణంగా భారత జట్టు ఒక్కసారిగా షాక్​కు గురైంది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఎంఎస్ ధోనీ రనౌట్ కావడం వల్ల న్యూజిలాండ్‌ చేతిలో టీమ్ఇండియాకు ఘోర పరాజయం తప్పలేదు. అయితే తాజాగా ఈ టోర్నీ గురించి క్రికెటర్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ధోనీ ఈ టోర్నీలో లోయర్‌ ఆర్డర్​లో బరిలోకి వచ్చాడు. అప్పుడే కీలకమైన నాలుగో స్థానం కోసం అంబటి రాయుడు, అలాగే విజయ్ శంకర్‌ మధ్య పోటీ జరిగింది. రాయుడును కాదని విజయ్‌ను ఆ స్థానానికి ఎంపిక చేయడం పట్ల నాటి సెలక్షన్ కమిటీపై అంబటి రాయుడు అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కానీ ఇదంతా జరగకుండా ధోనీనే వారి స్థానంలో వచ్చుంటే బాగుండేదంటూ రోహిత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అయితే ఈ విషయంలో కెప్టెన్‌తో పాటు కోచ్‌ నిర్ణయమే కీలకమని చెప్పిన రోహిత్ వ్యక్తిగతంగా తనకు మాత్రం ధోనీ '4'వ ప్లేస్‌లో రావాలని అనిపించినట్లు వెల్లడించాడు.

"జట్టులో ధోనీ స్థానం అత్యంత కీలకమని అందరికీ తెలుసు. టీమ్​ కోసమైనా అతడు నాలుగో స్థానంలో వచ్చి ఉంటే బాగుండేది. అప్పటి కెప్టెన్ విరాట్, కోచ్‌ ఆలోచనలను నేను ఏమాత్రం తప్పుపట్టట్లేదు. కానీ ఒకవేళ ఆ మ్యాచ్​లో ధోనీ ముందే బ్యాటింగ్‌కు దిగుంటే నేను సంతోషపడేవాడిని" అని రోహిత్ అన్నాడు.

మ్యాచ్ సాగిందిలా :
ఇకఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్​ జట్టు నిర్ణీత ఓవర్లలో 239 పరుగులు స్కోర్ చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలోకి దిగిన ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, రోహిత్, విరాట్ కోహ్లీ అందరూ ఒక్కో పరుగుకే పెవిలియన్‌ బాట పట్టారు. దీంతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్​ను రిషభ్‌ పంత్ (32), హార్దిక్‌ (32) ఓ మేరకు ఆదుకున్నారు. అయితే మంచి ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు వచ్చిన దినేశ్‌ కార్తిక్‌ కూడా ఆరు పరుగులకే విఫలమయ్యాడు.

అయితే భారత్ సరిగ్గా 96/6 స్కోరులో ఉన్నప్పుడు ధోనీ-జడ్డూ 116 పరుగుల భాగస్వామ్యంతో జట్టును విజయ తీరాలకు చేర్చేందుకు ప్రయత్నించారు. అలా ఏడో స్థానంలో వచ్చిన ధోనీ (50), రవీంద్ర జడేజా (77)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. కానీ చివర్లో వికెట్లను కోల్పోవడం వల్ల భారత్​ 221 పరుగులకే ఆలౌటైంది.

క్రికెటర్ ఆఫ్ ది ఇయర్​గా రోహిత్- CEAT అవార్డ్స్​లో కెప్టెన్ ఘనత - Rohit Sharma 2024

వన్డేల్లో హైయెస్ట్​ రన్స్​ చేసిన టీమ్​ఇండియా క్రికెటర్లు ఎవరు? రోహిత్‌ స్థానమెంత? - Top Indian Batters In ODI

ABOUT THE AUTHOR

...view details