Virat Kohli Century :ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్పై భారత్ ఘన విజయం నమోదు చేసింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో నెగ్గింది. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. కొంతకాలంగా తనపై వస్తున్న విమర్శలకు విరాట్ అద్భుత శతకంతో సమాధానమిచ్చాడు. విరాట్ మళ్లీ ఫామ్ అందుకోవడంతో అభిమానులు జోష్లో ఉన్నారు. ఈ క్రమంలోనే తన సతీమణి, నటి అనుష్క శర్మ కూడా కింగ్ సెంచరీపై ఆనందం వ్యక్తం చేసింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఫొటో షేర్ చేసింది.
ఇండో- పాక్ మ్యాచ్ను ఇంటి నుంచే వీక్షించిన అనుష్క, టీవీలో విరాట్ సెంచరీ సంబరాలను ఫొటో తీసి షేర్ చేసింది. దానికి 'లవ్', 'హైఫై' ఎమోజీలను జత చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇక సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ తన మెడలోని గొలుసుకున్న వెడ్డింగ్ రింగ్ను ముద్దాడాడు. అనుష్కకు సందేశమిచ్చేలా కెమెరాకు విజయసంకేతం చూపించాడు. ప్రస్తుతం అనుష్క పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
విరాట్పై పాక్ కెప్టెన్ ప్రశంసలు
ఈ మ్యాచ్లో విరాట్ అద్భుత ఇన్నింగ్స్ను పాకిస్థాన్ కెప్టెన్ రిజ్వాన్ ప్రశంసించాడు. తమ నుంచి కోహ్లీ మ్యాచ్ లాగేసుకున్నాడని అన్నాడు. 'విరాట్ హార్డ్ వర్క్ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈ మ్యాచ్ కోసం అతను చాలా కష్టపడి ఉంటాడు. చాలా ఈజీగా బంతిని బాదేశాడు. విరాట్ను ఔట్ చేయడానికి చాలా ప్రయత్నించాం. మేం అతడికి పరుగులు ఇవ్వొద్దనుకున్నాం'