Deeparadhana : కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణించినప్పుడు కొందరు ఏడాది వరకూ ఎటువంటి పూజలు చేయరు. అంతేకాదు, కనీసం దీపాన్ని కూడా వెలిగించరు. మరికొందరైతే దేవుళ్ల ఫొటోలు, విగ్రహాలు ఒక వస్త్రంలో చుట్టి అటకమీద ఉంచుతుంటారు. సంవత్సరీకం పూర్తయ్యాక వాటిని కిందకు దింపి శుభ్రం చేసి ఆ తర్వాతే పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తుంటారు. అయితే, నిజంగానే ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది పాటు పూజలు నిర్వహించవద్దా? దీపారాధన చేయకూడదా? శాస్త్రం ఏం చెబుతోంది? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇంట్లో ఎవరైనా చనిపోతే నిజంగానే సంవత్సరం పాటు పూజా కార్యక్రమాలు చేయకూడదా? అనే దానిపై ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ అన్నదానం చిదంబరశాస్త్రి ఈ విధంగా సమాధానం ఇస్తున్నారు. కుటుంబసభ్యులు మరణిస్తే ఏడాది పాటు పూజలు, దీపారాధన చేయకూడదని ఏ శాస్త్రాల్లోనూ పేర్కొనలేదంటున్నారు.
దీపారాధన చేసుకోవచ్చు!
హిందూ సంప్రదాయంలో దీపారాధనకు ప్రత్యేక స్థానం ఉంది. దీపంఅనేది శుభానికి సంకేతం. దీపం వెలిగించిన చోట, మనం నిత్యం పూజించే పటాల్లో, విగ్రహాల్లో దేవతలు నివసిస్తుంటారని చెబుతున్నారు ప్రవచనకర్త చిదంబరశాస్త్రి. అలాంటిది ఏడాది పాటు వాటన్నింటినీ పక్కన పెట్టేయడం అనేది దోషం కిందకే వస్తుందంటున్నారు. కాబట్టి, ఒక వ్యక్తి మరణించిన తరువాత కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక యథావిధిగా దీపారాధన చేయొచ్చని శాస్త్రాలే వివరిస్తున్నాయని అంటున్నారు. అప్పటివరకూ చేసినటువంటి పూజా కార్యక్రమాలన్నింటిని తిరిగి నిరభ్యంతరంగా ప్రారంభించొచ్చని సూచిస్తున్నారు. అయితే, కొత్త పూజలు మాత్రం చేయకూడదని చెబుతున్నారు.
దేవాలయాలకు వెళ్లొచ్చా?