Minister Sridhar Babu On Drone Technology :తెలంగాణ రాష్ట్రంలో డ్రోన్ టెక్నాలజీ విస్తరణకు పలు సంస్థలు ముందుకొచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. ఈ ఏడాది నూతనంగా 500 ఉద్యోగాలు ఇవ్వనున్నట్లుగా ఆయన వెల్లడించారు. సెంటిలియాన్, హెచ్పీ రోబోటిక్స్ సంస్థల ప్రతినిధులు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో శ్రీధర్బాబును కలిశారు. ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ పరిశ్రమల స్థాపన, పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి నమ్మకం కలిగించే విధంగా పారిశ్రామిక విధానాలు రూపొందిస్తున్నట్లుగా తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ పరిశ్రమలను విస్తరించాల్సిన అవసరం ఉందని శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు.
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు పరిశ్రమలు విస్తరించాలి : శ్రీధర్బాబు - MINISTER SRIDHAR BABU ON INDUSTRIES
మంత్రి శ్రీధర్బాబును కలిసిన సెంటిలియాన్, హెచ్సీ రోబోటిక్స్ ప్రతినిధులు- రాష్ట్రంలో డ్రోన్ టెక్నాలజీ విస్తరణకు ముందుకొచ్చిన సంస్థలు - ఈ ఏడాది 500 కొత్త ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు వెల్లడి
![ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు పరిశ్రమలు విస్తరించాలి : శ్రీధర్బాబు Minister Sridhar Babu On Drone Technology](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-02-2025/1200-675-23494815-thumbnail-16x9-sridhar-babu.jpg)
Minister Sridhar Babu On Drone Technology (ETV Bharat)
Published : Feb 7, 2025, 5:08 PM IST