Congress Leaders Counter to Harish Rao Challenge :లోక్సభ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయం మండు వేసవిని మించి భగ్గుమంటోంది. రైతు రుణమాఫీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సవాళ్లు-ప్రతిసవాళ్లు మంటలు రేపుతున్నాయి. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు చేసిన సవాల్ మాటల యుద్ధానికి దారి తీసింది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని, చేయకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తారా అంటూ ఇవాళ హరీశ్ రావు గన్పార్క్ అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లి మరోసారి ఛాలెంజ్ చేశారు.
హరీశ్రావు అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి మలినం చేశారని, పసుపు నీళ్లతో ఆ మలినాన్ని శుద్ధి చేసినట్లు ఎమ్మెల్సీ, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తెలిపారు. ఆగస్టు 15లోగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటిచ్చారని గుర్తు చేశారు. ఆ మాటలను అమలు చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని ప్రశ్నించారు.హరీశ్రావు తన రాజీనామాతో కొత్త డ్రామాకు తెర తీశారని మండిపడ్డారు. రూ.2 లక్షల రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. హరీశ్రావు రాజీనామా విషయంలో తాను బాధ్యత తీసుకొని రాజీనామా ఆమోదించేలా చేస్తానని వెంకట్ స్పష్టం చేశారు.
ఛాలెంజ్ యాక్సెప్టెడ్ - ఆ హామీలన్నీ అమలు చేస్తే నేను రాజీనామా చేస్తా - మళ్లీ పోటీ చేయను : హరీశ్ రావు