తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 3:27 PM IST

Updated : Feb 22, 2024, 3:52 PM IST

ETV Bharat / international

మాల్దీవుల్లోకి ప్రవేశించిన చైనా పరిశోధక నౌక- ఆందోళన వ్యక్తం చేసిన ఇండియన్ నేవీ

Chinese Research Ship In Maldives : భారత్‌తో దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న వేళ చైనా పరిశోధక నౌక షియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌-03 మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవడం కలకలం రేపుతోంది. మాల్దీవుల రాజధాని మాలె తీరంలో ఈ నౌక లంగరు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 4 వేల 300 టన్నుల బరువున్న ఈ నౌక హిందూ మహాసముద్రంలోని జలాల్లో మోహరిస్తే భద్రతా పరమైన సమస్యలు తలెత్తుతాయని భారత నావికాదళ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Chinese Research Ship In Maldives
Chinese Research Ship In Maldives

Chinese Research Ship In Maldives :మాల్దీవులతో భారత్‌కు దౌత్య వివాదం కొనసాగుతున్న వేళ చైనాకు చెందిన పరిశోధక నౌక షియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌-03 మాల్దీవుల జలాల్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. గ్లోబల్ షిప్-ట్రాకింగ్ డేటా ప్రకారం, చైనా పరిశోధన నౌక షియాంగ్ యాంగ్ హాంగ్‌ మాల్దీవులకు చేరుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ నౌక రాకపై భారత నావికాదళ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హిందూ మహాసముద్ర జలాల్లో జలాంతర్గాముల సంచారానికి అవసరమైన మార్గాలను గుర్తించే అవకాశం ఈ నౌక వల్ల చైనాకు లభిస్తుందని పేర్కొన్నాయి. దీని వల్ల భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశముందని హెచ్చరించాయి.

షియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌-03 నౌక చైనాలోని థర్డ్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ ఓషనోగ్రఫీకి చెందింది. సముద్ర గర్భంలోని పరిస్థితులు, ఖనిజాన్వేషణ, ఇతర అంశాలపై పరిశోధనలు జరపడమే దీని ముఖ్య ఉద్దేశమని చైనా చెబుతోంది. జనవరిలో చైనాలోని సన్యా నుంచి బయలుదేరిన ఈ పరిశోధక నౌక తర్వలో మాల్దీవుల రాజధాని మాలె తీరానికి రానున్నట్టు తెలుస్తోంది. ఈ నౌక మరికొన్ని రోజుల్లో తమ జలాల్లోకి ప్రవేశించినుందని చెప్పిన మాల్దీవులు ఎలాంటి పరిశోధనలు నిర్వహించదని తెలిపింది. ఇప్పటికే శ్రీలంక వెళ్లిన ఈ తరహా నౌకలు వాటి కార్యకలాపాలను జలాల వరకే పరిమితం చేయకుండా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాయి. ఆ సమయంలో మాల్దీవులు, శ్రీలంక మధ్యనున్న జలాల్లో కదలడంపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు హిందు మహాసముద్రంలో చైనా ప్రభావం విస్తరిస్తుండటం వల్ల పరిశోధక నౌక కదలికల్ని భారత్ నిశితంగా గమనిస్తోంది.

'ఆ లోపు మా దేశాన్ని ఖాళీ చేయండి'
గత కొద్ది రోజుల క్రితం మాల్దీవుల నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు భారత్​కు స్పష్టం చేశారు. మార్చి 15 నాటికి ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాలని తమ అధ్యక్షుడు చెప్పినట్లు మాల్దీవుల అధికారులు భారత హైకమిషనర్‌కు తెలిపారు. ఈ మేరకు ఇరు దేశాలు ఏర్పాటు చేసిన హై-లెవెల్​ కోర్​ గ్రూపు, మాలేలోని విదేశాంగ శాఖ కార్యాలయంలో మొదటి సారి సమావేశమైంది. మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని వెనక్కి పిలిపించాలన్న అభ్యర్థనపై ఆ సమావేశంలో చర్చించారు. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్​ పై క్లిక్ చేయండి.

'భారత్​తో వివాదం మనకే చేటు'- మాల్దీవులు అధ్యక్షుడి తీరుపై స్వదేశంలో విమర్శలు

పర్యటకులను పంపాలని చైనాకు మాల్దీవులు విజ్ఞప్తి- భారత్​పై మరోసారి బయటపడిన డ్రాగన్​​ వక్రబుద్ధి

Last Updated : Feb 22, 2024, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details