Curries and Vegetables storage in Fridge : కూలింగ్ ఫ్రిజ్ రాకముందు జనాలు దాదాపుగా ఆరోగ్యకరమైన భోజనాన్నే తినేవారు. ఏరోజు కూరలు ఆరోజే తినేవారు. మహా కాదంటే.. రాత్రి వండిన కూర తెల్లారి పొద్దున ఆరగించేవారు. కానీ, రిఫ్రిజిరేటర్ వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. రోజుల తరబడి కూరలు ఫ్రిజ్లో పెట్టి తినడం అలవాటుగా మారిపోయింది. కానీ, ఇలా చేయడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
కాయగూరలు, ఆకు కూరలు, పండ్లు, మాంసం ఇలా ఏదైనా సరే, తీసుకెళ్లి ఫ్రిజ్లో కుక్కేయడం దాదాపుగా అందరికీ అలవాటు. కానీ, దీనివల్ల ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువ అంటున్నారు నిపుణులు. ఎక్కువ రోజులు ఫ్రిజ్లో ఉంచితే వాటిలోని పోషకాలు తగ్గిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక పాలు, చీజ్ వంటి హై-ప్రొటీన్ పదార్థాలు త్వరగా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. వాటిపై త్వరగా బ్యాక్టీరియా చేరే అవకాశం ఉందని అంటున్నారు. అందువల్ల వాటిని వెంటనే ఉపయోగించాలని సూచిస్తున్నారు.
వండిన అన్నం, ఇంకా పాస్తా, దుంపలు వంటివాటిని ఫ్రిజ్లో పెట్టకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఒకవేళ అన్నం ఫ్రిజ్లో ఉంచితే 24 గంటల్లోపు తినేయాలని యూకేకు చెందిన "నేషనల్ హెల్త్ సర్వీస్" సూచించింది.
ఇక, మిగిలిన కూరల గురించి కీలక సూచనలు చేస్తున్నారు. వీలైనంత వరకు తాజాగా తినేయడమే మంచిదని చెబుతున్నారు. ఒకవేళ మిగిలితే ఆ కూరలను ఫ్రిజ్లో పెట్టుకొని మర్నాడు తింటే పరవాలేదని అంటున్నారు. కానీ, మూడు రోజులు ఫ్రిజ్లో నిల్వ ఉంచితే ఆహారం దెబ్బ తింటుందని, విషతుల్యమవుతుందని NHS హెచ్చరించింది. (NHS రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సలాడ్స్, మసాలా కూరల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని, ఫుడ్ పాయిజనింగ్తో ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చెబుతున్నారు.