తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'అందరూ ప్రభాస్​నే పెళ్లి చేసుకోవాలనుకుంటారు'- డార్లింగ్ క్రేజ్​​పై తమన్నా కామెంట్స్! - TAMANNAAH ON PRABHAS

ప్రభాస్​కు అమ్మాయిల్లో ఫుల్ క్రేజ్ - అందరూ తననే కోరుకుంటారట- ఇంటర్వ్యూలో తమన్నా కామెంట్స్​!

Tamannaah On Prabhas
Tamannaah On Prabhas (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2024, 9:30 PM IST

Tamannaah On Prabhas :టాలీవుడ్‌లోనే కాదు మూవీ ఇండస్ట్రీలోనే మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్లలో ప్రభాస్‌ ఒకరు. చాలా సార్లు ప్రభాస్‌ పెళ్లి టాపిక్‌ సోషల్‌ మీడియా ట్రెండ్‌ అయ్యింది. ముఖ్యంగా హీరోయిన్లు కృతి సనన్, అనుష్క శెట్టితో డేటింగ్ చేసినట్లు ప్రచారం సాగింది. కానీ, వీటిపై ప్రభాస్‌ ఎప్పుడూ నోరు విప్పలేదు.

మూవీ ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు, టీవీ షోలలో ప్రభాస్‌కి తరచూ పెళ్లెప్పుడు? అనే ప్రశ్న ఎదురవుతుంటుంది. దీనికి అతడి నుంచి చిరునవ్వే సమాధానంగా వస్తుంటుంది. అయితే ప్రభాస్‌ పెళ్లి గురించి తన కో- సార్ట్‌ తమన్నా భాటియా ఆసక్తికర విషయాలు షేర్‌ చేసుకుంది. 'బాహుబలి' తర్వాత, దేశంలో చాలా మంది అమ్మాయిలు ప్రభాస్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్నారని చెప్పింది.

'నాకు తెలిసి చాలా మంది ప్రభాస్‌ని పెళ్లి చేసుకోవాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. మన సినిమాల గురించి ఇతర రాష్ట్రాలకు పెద్దగా తెలియనప్పుడు కేవలం దక్షిణాది రాష్ట్రాల్లోనే అతడికి ఫాలోయింగ్‌ ఉందనుకున్నాను. బాహుబలి రిలీజ్ తర్వాత యావత్ దేశంలోని అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. బాహుబలిలో అమరేంద్ర బాహుబలి పాత్రలాగానే ప్రభాస్ నిజ జీవితంలో కూడా చాలా సాధారణంగా ఉంటాడు. అతను రాజు లాంటివాడు. మనసు చాలా సున్నితంగా, దయతో ఉంటుంది. అతడికి బలమైన వ్యక్తిత్వం కూడా ఉంది' అని గతంలో ఓ ఇంటర్వ్యూలో తమన్నా చెప్పింది

ఇలా ప్రభాస్‌ గురించి తమన్నా చాలా సార్లు మాట్లాడింది. ఓ సారి తన స్నేహితులు, కుటుంబ సభ్యులు ప్రభాస్‌ను ప్రేమిస్తున్నారని, అతడిని వ్యక్తిగతంగా కలవాలనుకుంటున్నారని చెప్పింది. ప్రభాస్‌తో కలిసి పని చేయడానికి ఇష్టపడతానని, స్క్రిప్ట్ దొరికినప్పుడు పని చేస్తామని పేర్కొంది. భవిష్యత్తులోనూ ప్రభాస్​తో కలిసి నటించే అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసింది.

ప్రభాస్- తమన్నా 2012లో విడుదలైన 'రెబల్' సినిమాలో కలిసి నటించారు. దీనికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. ఇది బాక్సాఫీస్‌ వద్ద మిశ్రం స్పందన దక్కించుకుంది. ఆ తర్వాత కొరటాల శివ 'మిర్చి', రాజమౌళి 'బాహుబలి'యాక్ట్‌ చేశారు. పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజైన 'బాహుబలి'ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

'రాజా సాబ్​' బర్త్​డే స్పెషల్ మోషన్ పోస్టర్ - సింహాసనంపై కూర్చొని సిగార్ కాలుస్తూ

60 కోట్ల విలువైన వజ్రం చోరీ - ఓటీటీ రిలీజ్​కు సిద్ధమైన తమన్నా క్రైమ్ థ్రిల్లర్​

ABOUT THE AUTHOR

...view details