ETV Bharat / state

ఓఎల్​ఎక్స్​లో టూ వీలర్ అమ్మాలనుకుంటున్నారా? - ఇలాంటి దొంగలుంటారు జాగ్రత్త​ - BACHUPALLY POLICE

ద్విచక్ర వాహనాల చోరీ కేసులో నిందితులను అరెస్టు చేసిన బాచుపల్లి పోలీసులు - టెస్ట్​ డ్రైవ్​ చేస్తామని చెప్పి బైక్​ దొంగతనం - బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్న పోలీసులు

TWO WHEELER THIEVES
BACHUPALLY POLICE (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2025, 9:47 PM IST

Updated : Feb 3, 2025, 9:54 PM IST

Two Wheeler Thieves Arrested : హైదరాబాద్ నగరంలో ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న వ్యక్తులను బాచుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత నెల జనవరి 23న మహేశ్​ అనే సాఫ్ట్​వేర్​ ఉద్యోగి తన ద్విచక్రవాహనం చోరీకి గురైందని బాచుపల్లి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. మహేశ్​ తన ద్విచక్ర వాహనం సుజుకి యాక్సెంచర్​ను అవసరాల నిమిత్తం ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్​ అయిన ఓఎల్​ఎక్స్​లో అమ్మకానికి పెట్టాడు.

టెస్ట్​డ్రైవ్​ అని ఉడాయించారు : ఓఎల్​ఎక్స్​లో యాడ్​ చూసి రమేశ్​ అనే వ్యక్తి మహేశ్​కు ఫోన్​ చేసి మాట్లాడాడు. అనంతరం ఆటోలో స్కూటీని చూడడానికి రమేశ్​ బాబు, గుండప్ప, నర్సింహా ముగ్గురు వెళ్లారు. అనంతరం ముగ్గురు నిందితులు మహేశ్​ను నమ్మించి టెస్ట్​డ్రైవ్​ చేస్తామని వెళ్లారు. ఎంత సేపు ఎదురుచూసిన మళ్లీ తిరిగి రాలేదు. దీంతో మోసపోయానని, తన వాహనాన్ని దొంగిలించారని నిర్దారణకు వచ్చిన మహేశ్​ సమీపంలోని బాచుపల్లి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలోని ఆధారాలను పరిశీలించారు.

రిమాండ్​కు తరలింపు : వాటిలో పోలీసులకో ఓ ఆధారం దొరికింది. మరింత దర్యాప్తు చేసి నిందితులైన రమేశ్​ బాబు(27), గుండప్ప(24)లను అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. మరో నిందితుడు నర్సింహ పరారీలో ఉన్నట్లు బాలానగర్​ డీసీపీ సురేశ్​ కుమార్​ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ ముగ్గురిపైనా గతంలో కొన్ని కేసులు ఉన్నట్లు తెలిపారు. చోరీ చేసిన వాహనాలను అమ్మేసి డబ్బులను ముగ్గురు పంచుకున్నట్లు చెప్పారు. వీరి నుంచి దాదాపుగా రూ.4లక్షల విలువైన 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. బాచుపల్లి పీఎస్​ పరిధిలో 3, జగద్గిరుగుట్ట, మియాపూర్, కేపీహెచ్​బీలో ఒక్కోటి చొప్పున ఉన్నాయని చెప్పారు.

Two Wheeler Thieves Arrested : హైదరాబాద్ నగరంలో ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న వ్యక్తులను బాచుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత నెల జనవరి 23న మహేశ్​ అనే సాఫ్ట్​వేర్​ ఉద్యోగి తన ద్విచక్రవాహనం చోరీకి గురైందని బాచుపల్లి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. మహేశ్​ తన ద్విచక్ర వాహనం సుజుకి యాక్సెంచర్​ను అవసరాల నిమిత్తం ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్​ అయిన ఓఎల్​ఎక్స్​లో అమ్మకానికి పెట్టాడు.

టెస్ట్​డ్రైవ్​ అని ఉడాయించారు : ఓఎల్​ఎక్స్​లో యాడ్​ చూసి రమేశ్​ అనే వ్యక్తి మహేశ్​కు ఫోన్​ చేసి మాట్లాడాడు. అనంతరం ఆటోలో స్కూటీని చూడడానికి రమేశ్​ బాబు, గుండప్ప, నర్సింహా ముగ్గురు వెళ్లారు. అనంతరం ముగ్గురు నిందితులు మహేశ్​ను నమ్మించి టెస్ట్​డ్రైవ్​ చేస్తామని వెళ్లారు. ఎంత సేపు ఎదురుచూసిన మళ్లీ తిరిగి రాలేదు. దీంతో మోసపోయానని, తన వాహనాన్ని దొంగిలించారని నిర్దారణకు వచ్చిన మహేశ్​ సమీపంలోని బాచుపల్లి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలోని ఆధారాలను పరిశీలించారు.

రిమాండ్​కు తరలింపు : వాటిలో పోలీసులకో ఓ ఆధారం దొరికింది. మరింత దర్యాప్తు చేసి నిందితులైన రమేశ్​ బాబు(27), గుండప్ప(24)లను అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. మరో నిందితుడు నర్సింహ పరారీలో ఉన్నట్లు బాలానగర్​ డీసీపీ సురేశ్​ కుమార్​ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ ముగ్గురిపైనా గతంలో కొన్ని కేసులు ఉన్నట్లు తెలిపారు. చోరీ చేసిన వాహనాలను అమ్మేసి డబ్బులను ముగ్గురు పంచుకున్నట్లు చెప్పారు. వీరి నుంచి దాదాపుగా రూ.4లక్షల విలువైన 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. బాచుపల్లి పీఎస్​ పరిధిలో 3, జగద్గిరుగుట్ట, మియాపూర్, కేపీహెచ్​బీలో ఒక్కోటి చొప్పున ఉన్నాయని చెప్పారు.

రూ.లక్షలు పెట్టి కొన్న బైక్ - ఈ చిన్న ఖర్చుతో దొంగల నుంచి కాపాడుకుందాం

పార్క్ చేసిన బైక్ నుంచి 5లక్షలు ఎంత సింపుల్​గా కొట్టేశాడో చూడండి

Last Updated : Feb 3, 2025, 9:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.