AK 64 Movie :కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవలే 'విడాముయార్చి' (తెలుగులో పట్టుదల) మూవీతో థియేటర్లలో సందడి చేశారు. మగిల్ తిరుమేని తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో హీరోయిన్గా త్రిష నటించగా, అర్జున్, రెజీనా కీలక పాత్రలు పోషించారు. కాగా, ఇప్పుడు స్టార్ హీరో అజిత్ తదుపరి సినిమా గురించి ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
క్రేజీ డైరెక్టర్తో అజిత్
అజిత్ కుమార్ తన 64 సినిమాను కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్తో చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ 'ఏకే 64' అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కనున్నట్లు సమాచారం. కాగా, ఇటీవల కాలంలో అజిత్ తన తదుపరి ప్రాజెక్ట్ను నితిలన్ స్వామినాథన్తో చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అలాగే ప్రశాంత్ నీల్, విష్ణువర్ధన్, వెంకట్ ప్రభు వంటి డైరెక్టర్లతో అజిత్ జతకట్టనున్నారని వార్తలు వెలువడ్డాయి. తాజాగా కార్తీక్ సుబ్బరాజ్తో సినిమా చేయనున్నారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
పాజిటివ్ టాక్
ఫిబ్రవరి 6న రిలీజైన అజిత్ విడాముయార్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా అజిత్ సరసన త్రిష నటించారు. కోలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ , అర్జున్, రెజీనా కీలక పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. లైకా సుబాస్కరన్ తన సొంత బ్యానర్ అయిన లైకా ప్రొడక్షన్స్ పై ఈ సినిమాను నిర్మించగా, మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించారు.