తెలంగాణ

telangana

చైల్డ్ ఆర్టిస్ట్​గా ఎంట్రీ- IAS కావాలని ఇండస్ట్రీకి దూరం!- ఆ నటి ఎవరంటే?

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 9:04 AM IST

Actress Become IAS: రంగుల ప్రపంచంలో విహరించాలని ఎంతో మంది కలలు కంటుంటారు. సినిమాల పిచ్చితో ఇంట్లో నుంచి బయటకు వచ్చినవాళ్లేందరో ఉన్నారు. ఈ సినిమాల కోసం ప్రభుత్వ ఉద్యోగాలను సైతం వదులుకుని ఇండస్ట్రీ బాట పట్టి స్టార్స్​గా ఎదిగిన హీరోలను ఎంతో మందిని చూశాం. ఇదే కాదు చిత్రపరిశ్రమలో అవకాశాల్లేక రోడ్డునపడ్డవాళ్లనూ చూశాం. కానీ, ఇప్పుడు మనం చెప్పుకునే ఓ మహిళ మాత్రం చిన్న వయస్సులోనే చిత్రసీమలోకి అడుగుపెట్టి ఆ తర్వాత ఐఏఎస్ అయ్యింది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఒక్కసారి సినిమా లోకంలోకి అడుగుపెట్టాక భయటకు రావడం కష్టం. కానీ ఏకంగా ఐఏఎస్ సాధించిన ఆ మహిళ గురించి మీకూ తెలుసా?

Actress Become IAS
Actress Become IAS

Actress Become IAS:సినిమాల్లో, టీవీ షోలలో నటీనటులు ఐఏఎస్ ఆఫీసర్ల పాత్రలు పోషించడం మనం తరచుగా చూస్తుంటాము. కానీ, నిజ జీవితంలో గ్లిట్జ్, గ్లామర్ ప్రపంచాన్ని వదిలి ఐఎఎస్ (Indian Administrative Service) అధికారిగా మారడటం చాలా అరుదు. అలా ఓ యువతి నిజంగా ఐఏఎస్​ అయ్యింది. ఆమె ఎవరో కాదు హెచ్ఎస్ కీర్తన. ఆమె ఒకప్పుడు బాల నటి, కానీ ఆమె ఐఏఎస్ ఆఫీసర్ కావడానికి సినిమా ప్రపంచానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.

యుపిఎస్‌సి (Union Public Service Commission) పరీక్ష భారతదేశంలో అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటి. చాలా మంది రాణించాలని కలలు కంటుంటారు. దాని తగ్గట్లుగా రాత్రింబవళ్లూ కష్టపడి చదువుతుంటారు. ఇందులో రాణించక ఎన్నో విఫల ప్రయత్నాలతో విరమించుకునేవారు ఉంటారు. అయితే హెచ్ఎస్ కీర్తన మాత్రం ఐఏఎస్ సాధించాలన్న తపనతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. చలనచిత్రాలు, టీవీ షోలలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నుంచి ఐఏఎస్ ఆఫీసర్‌గా మారింది.

హెచ్ఎస్ కీర్తన ఒక పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్. తెలుగుతోపాటు కన్నడ సినిమాలు, సీరియల్స్ లోనూ నటించింది. 'కర్పూరద గొంబే', 'గంగా-యమునా', 'ముద్దిన అలియా','ఉపేంద్ర','ఎ', 'కానూరు హెగ్గదాటి', 'సర్కిల్ ఇన్‌స్పెక్టర్', 'ఓ మల్లిగే', 'లేడీ కమీషనర్', 'హబ్బ', 'దొరే', 'సింహాద్రి', 'జనని','చిగురు', 'పుటాని ఏజెంట్','పుతని' వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి అందర్నీ మెప్పించింది. కానీ తనకు చదువుపై ఉన్న ఆసక్తితో ఐఏఎస్ కావాలని కలలు కన్నది.ఎలాగైన ఐఏఎస్ అయ్యి ప్రజలకు సేవా చేయాలని నిర్ణయించుకుంది.

అనుకున్నట్లుగానే యూపీఎస్సీ పరీక్షకు హాజరైంది. తొలి ప్రయత్నంలో విఫలమైంది. అయినా కూడా ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఐదుసార్లు యూపీఎస్సీ పరీక్షకు హాజరైంది. ఐదుసార్లూ ఆమె ఉత్తీర్ణత సాధించలేకపోయింది. ఆరవ ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించింది. తన మొదటి పోస్టింగ్ కోసం కర్ణాటకలోని మాండ్యా జిల్లాను ఎంచుకుంది. అసిస్టెంట్ కమిషనర్ అపాయింట్ అయ్యింది.

ఐఏఎస్ అధికారి కావడానికి ముందు, 2011లో కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్షకు హాజరైంది. దానిని క్లియర్ చేసిన తర్వాత, ఆమె రెండు సంవత్సరాలు KAS ఆఫీసర్‌గా పనిచేస్తూ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యింది. ఐఏఎస్ అధికారి కావాలనే తన కలను కొనసాగిస్తూ తన నటనా జీవితాన్ని సమతుల్యం చేసుకుంది. అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, సంకల్పం, కృషి ఉంటే తమ కలలను సాకారం చేసుకోవచ్చని హెచ్ఎస్ కీర్తన ఇన్స్​స్పిరిషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సింగిల్​ డైలాగ్​ - రూ. 447 కోట్ల రెమ్యూనరేషన్ - ఆ స్టార్ హీరో డిమాండ్ అలాంటిది మరి!

ఈ టీవీ ఆర్టిస్ట్​ ఓ మిలియనీర్- బాలీవుడ్ హీరోల హీరోలనే మించిపోయాడుగా!

ABOUT THE AUTHOR

...view details