Goods That Will Be Cheaper After Union Budget 2024 : కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో(Union Budget 2024-25)పారిశ్రామిక రంగానికి ఊతమిస్తూ.. దేశీయ తయారీని ప్రోత్సహించేలా పలు వస్తువులపై భారీగా కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో రిటైల్ మార్కెట్లో ఎలక్ట్రానిక్, విలువైన లోహాలు, కీలక ఔషధాల ధరలు తగ్గనున్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ధరలు తగ్గనున్న వస్తువులివే..!
మొబైల్ ఫోన్లు :మొబైల్ ఫోన్లు, మొబైల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు(పీసీబీఏ), మొబైల్ ఛార్జర్లపై విధించే బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 20శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. దీంతో కస్టమర్లకు స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గబోతున్నాయి. గత ఆరేళ్లలో మొబైల్ ఫోన్ల దేశీయ ఉత్పత్తి, ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా నిపుణులు చెబుతున్నారు.
క్యాన్సర్ ఔషధాల ధరలు తగ్గింపు :క్యాన్సర్ రోగులకు ఊరటనిచ్చేందుకు వీలుగా.. ట్రీట్మెంట్కు వాడే మూడు రకాల క్యాన్సర్ ఔషధాలు (Trastuzumab Deruxtecan, Osimertinib, Durvalumab)పై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా తొలగించారు. దీంతో ఆయా డ్రగ్స్ రేట్లు భారీగా తగ్గనున్నాయి.
బంగారం, వెండి :వీటిపై కస్టమ్స్ సుంకాన్ని 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రతిపాదించారు. ఫలితంగా రిటైల్ డిమాండ్ పెరుగుతుందని, తద్వారా.. స్మగ్లింగ్ను అరికట్టడానికి దోహదపడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ప్లాటినమ్పై సుంకం భారీగా తగ్గింపు : బంగారం, వెండితో పాటు ప్లాటినమ్, పల్లాడియం, ఓస్మియుమ్, రుథేనియం, ఇరీడియంపై 15.4 శాతం నుంచి 6.4 శాతానికి కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు.
సోలార్ ఎనర్జీ భాగాలు : సౌర విద్యుత్ సంబంధిత భాగాలపై కస్టమ్స్ను పొడిగించకూడదని కేంద్ర ప్రభుత్వం నిన్నటి బడ్జెట్లో ప్రతిపాదించింది.
గుడ్ న్యూస్ - ముద్ర లోన్ లిమిట్ రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పెంపు!
సీ ఫుడ్ :బ్రూడ్స్టాక్స్, పాలీచాట్స్ వార్మ్, రొయ్యలు, చేపల మేతపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 5%కి తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు.