Stock Market Today November 12, 2024 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు భారీ నష్టాలతో ముగిశాయి. మంగళవారం ఉదయం మంచి లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు తరువాత తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. కానీ చివరికి భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలివెళ్తుండడం సహా; ఏసియన్, యూరోపియన్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 820 పాయింట్లు నష్టపోయి 78,675 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 257 పాయింట్లు కోల్పోయి 23,883 వద్ద ముగిసింది.
- లాభపడిన షేర్లు : సన్ఫార్మా, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్
- నష్టపోయిన షేర్లు :ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, ఎస్బీఐ, టాటా మోటార్స్, మారుతి సుజుకి, పవర్గ్రిడ్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా
విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, సోమవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.2,306.88 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు. మరోవైపు దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.2,026.63 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.