ETV Bharat / state

చార్​ధామ్​ యాత్రకు ప్రత్యేకంగా భారత్​ గౌరవ్​ రైళ్లు - టికెట్ ధర ఎంతో తెలుసా? - CHARDHAM YATRA TOUR

చార్​ధామ్​ యాత్రకు రైలు యాత్రను ప్రకటించిన నిర్వాహకులు - భారతీయ రైల్వే, టూర్స్​ టైమ్స్​, జీఎంవీఎన్​ల ఆధ్వర్యంలో నడపనున్న రైళ్లు - మే 8వ తేదీ నుంచి 23 వరకు కొనసాగనున్న చార్​ధామ్​ యాత్ర

SOUTH CENTRAL RAILWAY
CHARDHAM YATRA IN INDIA (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2025, 7:17 PM IST

Special Trains For Chardham Yatra Tour : భారత్ గౌరవ్ రైళ్లకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. దీనికోసం భారతీయ రైల్వే వివిధ ప్రాంతాలకు ప్రత్యేక భారత్ గౌరవ్ రైళ్లను నడిపిస్తోంది. మొట్టమొదటిసారిగా చార్​ధామ్ యాత్రకు భారతీయ రైల్వే శ్రీకారం చుట్టింది. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో వచ్చే మే నెలలో చార్​ధామ్ యాత్రను తలపెట్టినట్లు నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు. జీఎంవీఎన్(గర్ వాల్​ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్), భారతీయ రైల్వే, టూర్స్ టైమ్స్ సంయుక్తంగా చార్​ధామ్ యాత్రను ప్రవేశపెట్టాయి.

16 రోజుల పాటు చార్​ధామ్​ యాత్ర : మే 8వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దాదాపు 16 రోజులపాటు చార్​ధామ్ యాత్ర కొనసాగనుంది. గర్ వాల్ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో మొదటిసారిగా చార్​ధామ్ యాత్రను ప్రారంభిస్తున్నామని టూర్స్ టైమ్స్ తెలంగాణ, ఏపీ రీజినల్ ఇంఛార్జ్ రమేష్ అయ్యంగార్ తెలిపారు. హైదరాబాద్​లోని హరిత ప్లాజాలో నిర్వహించిన మీడియా సమావేశంలో చార్​ధామ్ యాత్ర విశేషాలను ఆయన వెల్లడించారు.

3 విభాగాలలో టికెట్ల ధరలు : యమునోత్రి, గంగోత్రి, కేదార్​నాథ్, బద్రీనాథ్​లను కవర్ చేస్తూ 16 రోజుల చార్​ధామ్​ను తలపెట్టినట్లు ఆయా సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ యాత్రకు ఫస్ట్ ఏసీకి ధర ఒక్కొక్కరికి రూ.82 వేల 5 వందలు, సెకండ్ ఏసీకి ఒక్కొక్కరికి రూ.75 వేల 5 వందలు, థర్డ్ ఏసీకి ఒక్కొక్కరికి రూ.70వేల 5 వందలను ప్యాకేజీలుగా నిర్ణయించినట్లు తెలిపారు.

భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా యాత్ర : ప్రతి కోచ్​లో సీసీ కెమెరాలు, టూర్ మేనేజర్, హౌస్ కీపింగ్​కు సంబంధించిన వ్యక్తులు, సెక్యూరిటీ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రయాణికులు సౌకర్యవంతంగా, భద్రతతో యాత్రను పూర్తి చేసే విధంగా చార్​ధామ్ యాత్ర​ను డిజైన్ చేశామన్నారు. ప్రయాణికుల భద్రతనే దృష్టిలో ఉంచుకుని ఈ యాత్రను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.

6నెలల తర్వాత బద్రీనాథుడి ఆలయం ఓపెన్​- వర్షాన్ని లెక్కచేయకుండా పోటెత్తిన భక్తులు - Char Dham Yatra 2024

సైకిల్​పై 8ఏళ్ల కూతురితో చార్​ధామ్ యాత్ర- ఆ వ్యక్తి కోసమే! - Chardham Yatra On Bicycle

Special Trains For Chardham Yatra Tour : భారత్ గౌరవ్ రైళ్లకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. దీనికోసం భారతీయ రైల్వే వివిధ ప్రాంతాలకు ప్రత్యేక భారత్ గౌరవ్ రైళ్లను నడిపిస్తోంది. మొట్టమొదటిసారిగా చార్​ధామ్ యాత్రకు భారతీయ రైల్వే శ్రీకారం చుట్టింది. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో వచ్చే మే నెలలో చార్​ధామ్ యాత్రను తలపెట్టినట్లు నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు. జీఎంవీఎన్(గర్ వాల్​ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్), భారతీయ రైల్వే, టూర్స్ టైమ్స్ సంయుక్తంగా చార్​ధామ్ యాత్రను ప్రవేశపెట్టాయి.

16 రోజుల పాటు చార్​ధామ్​ యాత్ర : మే 8వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దాదాపు 16 రోజులపాటు చార్​ధామ్ యాత్ర కొనసాగనుంది. గర్ వాల్ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో మొదటిసారిగా చార్​ధామ్ యాత్రను ప్రారంభిస్తున్నామని టూర్స్ టైమ్స్ తెలంగాణ, ఏపీ రీజినల్ ఇంఛార్జ్ రమేష్ అయ్యంగార్ తెలిపారు. హైదరాబాద్​లోని హరిత ప్లాజాలో నిర్వహించిన మీడియా సమావేశంలో చార్​ధామ్ యాత్ర విశేషాలను ఆయన వెల్లడించారు.

3 విభాగాలలో టికెట్ల ధరలు : యమునోత్రి, గంగోత్రి, కేదార్​నాథ్, బద్రీనాథ్​లను కవర్ చేస్తూ 16 రోజుల చార్​ధామ్​ను తలపెట్టినట్లు ఆయా సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ యాత్రకు ఫస్ట్ ఏసీకి ధర ఒక్కొక్కరికి రూ.82 వేల 5 వందలు, సెకండ్ ఏసీకి ఒక్కొక్కరికి రూ.75 వేల 5 వందలు, థర్డ్ ఏసీకి ఒక్కొక్కరికి రూ.70వేల 5 వందలను ప్యాకేజీలుగా నిర్ణయించినట్లు తెలిపారు.

భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా యాత్ర : ప్రతి కోచ్​లో సీసీ కెమెరాలు, టూర్ మేనేజర్, హౌస్ కీపింగ్​కు సంబంధించిన వ్యక్తులు, సెక్యూరిటీ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రయాణికులు సౌకర్యవంతంగా, భద్రతతో యాత్రను పూర్తి చేసే విధంగా చార్​ధామ్ యాత్ర​ను డిజైన్ చేశామన్నారు. ప్రయాణికుల భద్రతనే దృష్టిలో ఉంచుకుని ఈ యాత్రను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.

6నెలల తర్వాత బద్రీనాథుడి ఆలయం ఓపెన్​- వర్షాన్ని లెక్కచేయకుండా పోటెత్తిన భక్తులు - Char Dham Yatra 2024

సైకిల్​పై 8ఏళ్ల కూతురితో చార్​ధామ్ యాత్ర- ఆ వ్యక్తి కోసమే! - Chardham Yatra On Bicycle

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.