ETV Bharat / sports

బంగ్లాతో మ్యాచ్- జట్టులో జడేజా కష్టమే- వాళ్లిద్దరు మాత్రం పక్కా! - CHAMPIONS TROPHY 2025

బంగ్లాదేశ్- భారత్ : జడేజాకు చోటు కష్టమే- వాళ్లిద్దరు మాత్రం కన్ఫార్మ్!

Ind vs Ban
Ind vs Ban (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Feb 20, 2025, 11:00 AM IST

Ind vs Ban Champions Trophy 2025 : బంగ్లాదేశ్​తో మ్యాచ్​కు భారత్ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పుపై తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. అయితే సీనియర్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఈ మ్యాచ్​లో ఆడకపోవచ్చనే సంకేతాలు వెలువడ్డాయి. నెట్స్‌లో ప్లేయర్ల ప్రాక్టీస్​ను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ స్వయంగా పర్యవేక్షించాడు. ఈ సందర్భంగా జడ్డూతో సుదీర్ఘంగా మాట్లాడాడు. ఇక చివర్లో అతడిని ఓసారి హగ్‌ చేసుకున్నాడు. దీంతో అతడిని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు లేవంటూ ప్రచారం సాగుతోంది.

కాగా, ఈ ఆసక్తికర పరిణామంపై అఫిషియల్‌ బ్రాడ్‌కాస్టర్‌ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ను సంప్రదించింది. బంగ్లాదేశ్‌తో తలపడే తుది జట్టులో 'జడేజా ఆడడం లేదా?' అని ప్రశ్నించింది. దీనికి అతడు స్పందించాడు. ఈ మ్యాచ్‌లో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలన్నది టీమ్ఇండియా వ్యూహమని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే జడేజా జట్టులో ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ఇక జట్టులో ఆడే ఇద్దరు స్పిన్నర్లలో అక్షర్‌, కుల్దీప్‌ స్థానాలు దాదాపు ఖాయమన్నాడు.

వాళ్లిద్దరూ ఫిట్
సీనియర్ పేసర్ షమీ, కుల్దీప్ యాదవ్ ఫిట్​నెస్​పై కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. వాళ్లిద్దరూ ఫిచ్​గా ఉన్నారని రోహిత్‌ శర్మ ధ్రువీకరించారు. 'షమీ బౌలింగ్‌ ఫిట్‌నెస్‌ బాగుంది. కొన్ని మ్యాచ్​లు కూడా ఆడాడు. ఏదైనాకానీ, ఇప్పటివరకు పర్ఫెక్ట్‌గానే ఉన్నాడు. అతడు కొన్నేళ్లుగా టీమ్ఇండియా బౌలింగ్​ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ టోర్నీలో అతడు రిథమ్‌ అందుకుంటాడని ఆశిస్తున్నా. కుల్దీప్‌ హెర్నియా ఆపరేషన్‌ తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. ఇక ఇద్దరూ ఆడితే మాకు చాలా మంచిది' అని రోహిత్‌ పేర్కొన్నాడు. ఇక వన్డేల్లో విజయాలు సాధించాలంటే టాపార్డర్​ బ్యాటర్లు రాణించడం ముఖ్యమని రోహిత్ అన్నాడు.

తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), అక్షర్‌ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్‌ సింగ్

బంగ్లాదేశ్‌: నజ్ముల్‌ శాంటో (కెప్టెన్‌), తంజిద్, సౌమ్య సర్కార్, హృదాయ్, ముష్ఫికర్, మహ్మదుల్లా, మెహిదీ మిరాజ్, రిషాద్‌ హొసేన్, తస్కిన్, ముస్తాఫిజుర్, నహిద్‌ రాణా

తొలి మ్యాచ్​కు టీమ్ఇండియా సై- రికార్డులన్నీ మనవైపే!

ఛాంపియన్స్‌ ట్రోఫీ : 8-8-8 ఫార్ములా- ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?

Ind vs Ban Champions Trophy 2025 : బంగ్లాదేశ్​తో మ్యాచ్​కు భారత్ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పుపై తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. అయితే సీనియర్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఈ మ్యాచ్​లో ఆడకపోవచ్చనే సంకేతాలు వెలువడ్డాయి. నెట్స్‌లో ప్లేయర్ల ప్రాక్టీస్​ను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ స్వయంగా పర్యవేక్షించాడు. ఈ సందర్భంగా జడ్డూతో సుదీర్ఘంగా మాట్లాడాడు. ఇక చివర్లో అతడిని ఓసారి హగ్‌ చేసుకున్నాడు. దీంతో అతడిని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు లేవంటూ ప్రచారం సాగుతోంది.

కాగా, ఈ ఆసక్తికర పరిణామంపై అఫిషియల్‌ బ్రాడ్‌కాస్టర్‌ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ను సంప్రదించింది. బంగ్లాదేశ్‌తో తలపడే తుది జట్టులో 'జడేజా ఆడడం లేదా?' అని ప్రశ్నించింది. దీనికి అతడు స్పందించాడు. ఈ మ్యాచ్‌లో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలన్నది టీమ్ఇండియా వ్యూహమని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే జడేజా జట్టులో ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ఇక జట్టులో ఆడే ఇద్దరు స్పిన్నర్లలో అక్షర్‌, కుల్దీప్‌ స్థానాలు దాదాపు ఖాయమన్నాడు.

వాళ్లిద్దరూ ఫిట్
సీనియర్ పేసర్ షమీ, కుల్దీప్ యాదవ్ ఫిట్​నెస్​పై కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. వాళ్లిద్దరూ ఫిచ్​గా ఉన్నారని రోహిత్‌ శర్మ ధ్రువీకరించారు. 'షమీ బౌలింగ్‌ ఫిట్‌నెస్‌ బాగుంది. కొన్ని మ్యాచ్​లు కూడా ఆడాడు. ఏదైనాకానీ, ఇప్పటివరకు పర్ఫెక్ట్‌గానే ఉన్నాడు. అతడు కొన్నేళ్లుగా టీమ్ఇండియా బౌలింగ్​ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ టోర్నీలో అతడు రిథమ్‌ అందుకుంటాడని ఆశిస్తున్నా. కుల్దీప్‌ హెర్నియా ఆపరేషన్‌ తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. ఇక ఇద్దరూ ఆడితే మాకు చాలా మంచిది' అని రోహిత్‌ పేర్కొన్నాడు. ఇక వన్డేల్లో విజయాలు సాధించాలంటే టాపార్డర్​ బ్యాటర్లు రాణించడం ముఖ్యమని రోహిత్ అన్నాడు.

తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), అక్షర్‌ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్‌ సింగ్

బంగ్లాదేశ్‌: నజ్ముల్‌ శాంటో (కెప్టెన్‌), తంజిద్, సౌమ్య సర్కార్, హృదాయ్, ముష్ఫికర్, మహ్మదుల్లా, మెహిదీ మిరాజ్, రిషాద్‌ హొసేన్, తస్కిన్, ముస్తాఫిజుర్, నహిద్‌ రాణా

తొలి మ్యాచ్​కు టీమ్ఇండియా సై- రికార్డులన్నీ మనవైపే!

ఛాంపియన్స్‌ ట్రోఫీ : 8-8-8 ఫార్ములా- ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.