తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగం - కాకపోతే జాయినింగ్ ఆలస్యం! - INFOSYS 2022 BATCH ONBOARDING DELAY - INFOSYS 2022 BATCH ONBOARDING DELAY

Infosys CEO About 2022-Batch Onboarding Delays : తాము ఆఫర్ లెటర్ ఇచ్చిన ప్రతి ఒక్కరినీ ఉద్యోగంలోకి తీసుకుంటామని ఇన్ఫోసిస్​ సీఈఓ సలీల్ పరేఖ్ స్పష్టం చేశారు. కాకపోతే వారి జాయినింగ్ తేదీల్లో కాస్త మార్పు చేసినట్లు తెలిపారు. ఇన్ఫోసిస్ 2,000 మంది క్యాంపస్ రిక్రూట్మెంట్లకు ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను ఆలస్యం చేస్తోందని NITES ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సలీల్​ పరేఖ్ తాజా వ్యాఖ్యలు చేశారు.

Infosys
Infosys (ANI)

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2024, 4:57 PM IST

Infosys CEO About 2022-Batch Onboarding Delays : తాముఆఫర్ లెటర్ ఇచ్చిన ప్రతి ఒక్కరినీ ఉద్యోగంలో చేర్చుకుంటామని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్​ స్పష్టం చేశారు. అయితే జాయినింగ్ తేదీల్లో కాస్త మార్పు ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఇన్ఫోసిస్ కంపెనీ 2022 ఏప్రిల్​లో 2000 మంది ఫ్రెష్​ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్​లకు ఆఫర్ లెటర్స్ ఇచ్చింది. వీరిని సిస్టమ్ ఇంజినీర్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్​ రోల్స్ కోసం తీసుకుంటున్నట్లు తెలిపింది. కానీ ఇప్పటి వరకు వారిని ఉద్యోగంలోకి తీసుకోలేదు. దీనితో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై ఐటీ ఉద్యోగుల సంఘం 'నాసెంట్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్'(NITES) ఆగ్రహం వ్యక్తం చేసింది. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లలో ఇన్ఫోసిస్‌ చేసిన తీవ్ర జాప్యం వల్ల 2000 మందికిపైగా నిపుణులకు తీవ్రమైన నష్టం జరుగుతోందని NITES కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. సుమారు 2,000 మంది క్యాంపస్ రిక్రూట్​లకు ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను ఇన్ఫోసిస్‌ కంపెనీ పదేపదే ఆలస్యం చేస్తోందని, ఇది ఉద్యోగులకు ఆర్థిక, మానసిక ఇబ్బందులను కలిగిస్తోందని ఈ సంస్థ ఆరోపించింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని NITES కార్మిక మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేసింది. దీనితో సలీల్ పరేఖ్ తాజా వ్యాఖ్యలు చేశారు.

"మేము ఆఫర్ లెటర్ ఇచ్చిన ప్రతి అభ్యర్థిని కంపెనీలో చేర్చుకుంటాం. అందులో ఎలాంటి మార్పు లేదు. కాకపోతే మేము వారి జాయినింగ్ తేదీలను కాస్త మార్చాము."
- సలీల్​ పరేఖ్​, ఇన్ఫోసిస్ సీఈఓ

రెండేళ్లు వృథా!
ఇన్ఫోసిస్‌లో రెండేళ్లుగా ఆన్‌బోర్డింగ్‌ జాప్యం కొనసాగుతోందని NITES ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆన్​బోర్డింగ్ జాప్యం వల్ల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు వేరే ఉద్యోగం చేయకుండా ఉండిపోయి, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారని యూనియన్ పేర్కొంది. ఇదే విషయాన్ని కేంద్రానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ ఆన్‌బోర్డింగ్ టైమ్‌లైన్ లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతోందని తెలిపింది.

బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇన్ఫోసిస్​లో 2024 జూన్​ నాటికి 3,15,332 మంది ఉద్యోగులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details