Odisha Next CM: ఒడిశా శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మోగించింది. మొత్తం 147 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 78 స్థానాల్లో విజయం సాధించింది. బిజు జనతా దళ్ 51, కాంగ్రెస్ 14, ఇతరులు 4 చోట్ల గెలుపొందారు. లోక్సభ స్థానాల్లో కూడా బీజేపీ అదరగొట్టింది. మొత్తం 21 లోక్సభ స్థానాలకుగాను 20చోట్ల కమలం పార్టీ విజయం సాధించగా కాంగ్రెస్ ఓ స్థానంలో గెలుపొందింది. బిజూ జనతాదళ్ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కమలదళం సిద్ధమైంది. అయితే 25 ఏళ్ల తర్వాత ఒడిశాకు కొత్త వ్యక్తి ముఖ్యమంత్రిగా రానుండడంపై ఆయన ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
సీఎం రేసులో ప్రముఖులు
బీజేపీ తరఫున కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మాజీమంత్రి జోయల్ ఓరం, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు భైజయంత్ పండా, భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి, బాలాసోర్ ఎంపీ ప్రతాప్ సారంగి, కాగ్ గిరీశ్ చంద్ర ముఖ్యమంత్రి రేసులో ముందున్నారు.
ధర్మేంద్ర ప్రధాన్
సంబల్పుర్ లోక్సభ స్థానం నుంచి గెలిచిన ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశా ముఖ్యమంత్రి రేసులో ముందున్నారు. సంబల్పుర్లో బిజు జనతా దళ్ అగ్రనేత ప్రణబ్ ప్రకాశ్ దాస్పై లక్షా 19 వేల 836 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
కాగ్ గిరీశ్ చంద్ర
ముఖ్యమంత్రి రేసులో కాగ్ గిరీష్ ముర్ము పేరు కూడా బలంగా వినిపిస్తోంది. జమ్ముకశ్మీర్కు మొదటి లెఫ్టినెంట్ గవర్నర్గా ఆయన బాధ్యతలు నిర్వహించారు.