Ind vs Eng 3rd ODI 2025 : స్వదేశంలో ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ను టీమ్ఇండియా క్లీన్స్వీప్ చేసింది. మూడు వన్డేల్లో భాగంగా బుధవారం జరిగిన ఆఖరి మ్యాచ్లో భారత్ 142 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 357 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో ఇంగ్లాండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకే కుప్పకూలింది. టామ్ బంటన్ (38), గస్ అట్కిసన్ (38) మాత్రమే ఫర్వాలేదనిపించారు. భారత్ బౌలర్లలో అర్షదీప్, హర్షిత్ , హార్దిక్, అక్షర్ పటేల్ తలో 2, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.
భారీ ఛేదనను ఇంగ్లాండ్ దీటుగా ప్రారంభించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (23 పరుగులు), బెన్ డకెట్ (34 పరుగులు) దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. 6 ఓవర్లలోనే జట్టు స్కోర్ 60 దాటింది. ఈ దశలో అర్షదీప్ సింగ్ భారత్కు బ్రేక్ ఇచ్చాడు. 6.2 వద్ద డకెట్ను ఔట్ చేశాడు. ఆ తర్వాత సాల్ట్ను కూడా అర్షదీప్ పెవిలియన్ చేర్చాడు. కాసేపటికే స్వల్ప వ్యవధిలో టామ్ బంటన్, జో రూట్ (24), జాస్ బట్లర్ (6) ఔటయ్యారు.
చివర్లో టీమ్ఇండియా బౌలర్లు చెలరేగి ఇంగ్లాండ్కు ఛాన్స్ ఇవ్వలేదు. వరుసగా హ్యారీ బ్రూక్ (19), లివింగ్ స్టోన్ (9), ఆదిల్ రషీద్ (0), మార్క్ వుడ్ (9)ను పెలివియన్ చేర్చారు. ఆఖర్లో గస్ అట్కిసన్ (38 పరుగుల, 19 బంతుల్లో) పోరాడి ఓటమి అంతరాన్ని తగ్గించాడు. ఇక 34.2 ఓవర్ వద్ద అక్షర్ అతడి క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్కు తెర దించాడు.
𝐂𝐋𝐄𝐀𝐍 𝐒𝐖𝐄𝐄𝐏
— BCCI (@BCCI) February 12, 2025
Yet another fabulous show and #TeamIndia register a thumping 142-run victory in the third and final ODI to take the series 3-0!
Details - https://t.co/S88KfhFzri… #INDvENG @IDFCFIRSTBank pic.twitter.com/ZoUuyCg2ar
అంతకుముందు భారత్ 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. గిల్ (112) సెంతరీతో ఆకట్టుకోగా, శ్రేయస్ అయ్యర్ (78), విరాట్ కోహ్లీ (52) హాఫ్ సెంచరీలతో రాణించాకు. రాహుల్ (40) ఫర్వాలేదనిపించాడు. కాగా, ఈ సిరీస్లో ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్ల్లో నెగ్గిన టీమ్ఇండియా, తాజా విజయంతో 3-0తో దక్కించుకుంది.