ETV Bharat / sports

టీమ్ఇండియా ఆల్​రౌండ్ షో- 3-0తో సిరీస్ క్లీన్​స్వీప్ - INDIA VS ENGLAND ODI SERIES

మూడో వన్డేలో భారత్ ఘన విజయం- 3-0తో సిరీస్ క్లీన్​ స్వీప్

India vs England
India vs England (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Feb 12, 2025, 8:29 PM IST

Ind vs Eng 3rd ODI 2025 : స్వదేశంలో ఇంగ్లాండ్​తో వన్డే సిరీస్​ను టీమ్ఇండియా క్లీన్​స్వీప్ చేసింది. మూడు వన్డేల్లో భాగంగా బుధవారం జరిగిన ఆఖరి మ్యాచ్​లో భారత్ 142 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 357 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో ఇంగ్లాండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకే కుప్పకూలింది. టామ్ బంటన్ (38), గస్ అట్కిసన్ (38) మాత్రమే ఫర్వాలేదనిపించారు. భారత్​ బౌలర్లలో అర్షదీప్, హర్షిత్ , హార్దిక్, అక్షర్ పటేల్ తలో 2, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు. ​

భారీ ఛేదనను ఇంగ్లాండ్ దీటుగా ప్రారంభించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (23 పరుగులు), బెన్ డకెట్ (34 పరుగులు) దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. 6 ఓవర్లలోనే జట్టు స్కోర్ 60 దాటింది. ఈ దశలో అర్షదీప్ సింగ్ భారత్​కు బ్రేక్ ఇచ్చాడు. 6.2 వద్ద డకెట్​ను ఔట్ చేశాడు. ఆ తర్వాత సాల్ట్​ను కూడా అర్షదీప్​ పెవిలియన్ చేర్చాడు. కాసేపటికే స్వల్ప వ్యవధిలో టామ్ బంటన్, జో రూట్ (24), జాస్ బట్లర్ (6) ఔటయ్యారు.

చివర్లో టీమ్ఇండియా బౌలర్లు చెలరేగి ఇంగ్లాండ్​కు ఛాన్స్ ఇవ్వలేదు. వరుసగా హ్యారీ బ్రూక్ (19), లివింగ్ స్టోన్ (9), ఆదిల్ రషీద్ (0), మార్క్ వుడ్ (9)ను పెలివియన్ చేర్చారు. ఆఖర్లో గస్ అట్కిసన్ (38 పరుగుల, 19 బంతుల్లో) పోరాడి ఓటమి అంతరాన్ని తగ్గించాడు. ఇక 34.2 ఓవర్ వద్ద అక్షర్ అతడి క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్​కు తెర దించాడు.

అంతకుముందు భారత్ 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. గిల్ (112) సెంతరీతో ఆకట్టుకోగా, శ్రేయస్ అయ్యర్ (78), విరాట్ కోహ్లీ (52) హాఫ్ సెంచరీలతో రాణించాకు. రాహుల్ (40) ఫర్వాలేదనిపించాడు. కాగా, ఈ సిరీస్​లో ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్​ల్లో నెగ్గిన టీమ్ఇండియా, తాజా విజయంతో 3-0తో దక్కించుకుంది.

గిల్, విరాట్, అయ్యర్ మెరుపులు- ఇంగ్లాండ్​కు భారీ టార్గెట్

గిల్ ఆల్​టైమ్ రికార్డ్- ప్రపంచంలోనే తొలి బ్యాటర్​గా!

Ind vs Eng 3rd ODI 2025 : స్వదేశంలో ఇంగ్లాండ్​తో వన్డే సిరీస్​ను టీమ్ఇండియా క్లీన్​స్వీప్ చేసింది. మూడు వన్డేల్లో భాగంగా బుధవారం జరిగిన ఆఖరి మ్యాచ్​లో భారత్ 142 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 357 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో ఇంగ్లాండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకే కుప్పకూలింది. టామ్ బంటన్ (38), గస్ అట్కిసన్ (38) మాత్రమే ఫర్వాలేదనిపించారు. భారత్​ బౌలర్లలో అర్షదీప్, హర్షిత్ , హార్దిక్, అక్షర్ పటేల్ తలో 2, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు. ​

భారీ ఛేదనను ఇంగ్లాండ్ దీటుగా ప్రారంభించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (23 పరుగులు), బెన్ డకెట్ (34 పరుగులు) దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. 6 ఓవర్లలోనే జట్టు స్కోర్ 60 దాటింది. ఈ దశలో అర్షదీప్ సింగ్ భారత్​కు బ్రేక్ ఇచ్చాడు. 6.2 వద్ద డకెట్​ను ఔట్ చేశాడు. ఆ తర్వాత సాల్ట్​ను కూడా అర్షదీప్​ పెవిలియన్ చేర్చాడు. కాసేపటికే స్వల్ప వ్యవధిలో టామ్ బంటన్, జో రూట్ (24), జాస్ బట్లర్ (6) ఔటయ్యారు.

చివర్లో టీమ్ఇండియా బౌలర్లు చెలరేగి ఇంగ్లాండ్​కు ఛాన్స్ ఇవ్వలేదు. వరుసగా హ్యారీ బ్రూక్ (19), లివింగ్ స్టోన్ (9), ఆదిల్ రషీద్ (0), మార్క్ వుడ్ (9)ను పెలివియన్ చేర్చారు. ఆఖర్లో గస్ అట్కిసన్ (38 పరుగుల, 19 బంతుల్లో) పోరాడి ఓటమి అంతరాన్ని తగ్గించాడు. ఇక 34.2 ఓవర్ వద్ద అక్షర్ అతడి క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్​కు తెర దించాడు.

అంతకుముందు భారత్ 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. గిల్ (112) సెంతరీతో ఆకట్టుకోగా, శ్రేయస్ అయ్యర్ (78), విరాట్ కోహ్లీ (52) హాఫ్ సెంచరీలతో రాణించాకు. రాహుల్ (40) ఫర్వాలేదనిపించాడు. కాగా, ఈ సిరీస్​లో ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్​ల్లో నెగ్గిన టీమ్ఇండియా, తాజా విజయంతో 3-0తో దక్కించుకుంది.

గిల్, విరాట్, అయ్యర్ మెరుపులు- ఇంగ్లాండ్​కు భారీ టార్గెట్

గిల్ ఆల్​టైమ్ రికార్డ్- ప్రపంచంలోనే తొలి బ్యాటర్​గా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.