తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భర్తతోపాటే నా అంత్యక్రియలు చేయండి' - IAF లెఫ్టినెంట్ చనిపోయిన మరుసటి రోజే ఆర్మీ కెప్టెన్ బలవన్మరణం

దిల్లీలో భర్త చనిపోయిన విషయం తెలుసుకుని బలవన్మరణానికి పాల్పడిన భార్య - భర్తతో పాటే అంత్యక్రియలు చేయాలంటూ నోట్!

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Wife And Husband Ends Life In Agra
Wife And Husband Ends Life In Agra (ETV Bharat)

Wife And Husband Ends Life In Agra :ఓ ఐఏఎఫ్​ ఫ్లైట్ లెఫ్టినెంట్ మరణించిన మరుసటి రోజే ఆర్మీ కెప్టెన్​గా ఉన్న ఆయన భార్య కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. భర్తతో పాటే తనకు కూడా అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. ఈ ఘటన దిల్లీలో జరిగింది.

ఇదీ జరిగింది
అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం- బిహార్​కు చెందిన దీనదయాళ్​ దీప్​(32) ఆగ్రాలో ఎయిర్​ఫోర్స్​లో పని చేస్తున్నారు. 2022 డిసెంబర్​లో రాజస్థాన్​కు చెందిన ఆర్మీ కెప్టెన్ రేణు తన్వర్​ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆగ్రాలోని ఎయిర్​ఫోర్స్ క్యాంపస్​లోనే నివాసం ఉంటున్నారు. రేణు తన్వర్​ కూడా ఆగ్రాలోని మిలిటరీ నర్సింగ్​ సర్వీస్​ కెప్టెన్​గా వ్యహరిస్తున్నారు. అక్టోబర్ 14(సోమవారం) తన తల్లికి వైద్యం చేయించుకునేందుకు సోదరుడితో కలిసి దిల్లీ ఎయిమ్స్​ వెళ్లారు రేణు. అక్కడే దిల్లీ కంటోన్మెంట్​లోని ఆర్మీకి చెందిన గెస్ట్​ హౌస్​లో బస చేశారు.

అయితే సోమవారం రాత్రి దీప్​ విధులు ముగించుకుని స్నేహితులతో కలిసి భోజనం చేశాక తన గదికి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం డ్యూటీకి రాకపోవడం వల్ల సిబ్బంది వెళ్లి తలుపు తట్టి పిలిచినా ఎటువంటి స్పందన రాలేదు. దీంతో సిబ్బంది తలుపులు పగలగొట్టి చూడగా దీప్​ శవమై కనిపించారు. ఈ సమాచారాన్ని ఆయన భార్యకు చెప్పేందుకు కెప్టెన్​ రేణు సంప్రదించడానికి ప్రయత్నించినట్లు ఆగ్రా ఏసీపీ తెలిపారు. కానీ, ఆమె నుంచి ఎటువంటి స్పందన రాలేదని అన్నారు.

గెస్ట్​ హౌస్​లో బలవన్మరణం
బుధవారం ఉదయం కెప్టెన్ రేణు తన్వర్ మృతి చెందినట్లు దిల్లీ డీసీపీ సురేంద్ర కుమార్ చౌదరి నుంచి ఫోన్ వచ్చిందని తెలిపారు. దిల్లీలోని ఆర్మీ గెస్ట్​ హౌస్​లోనే బలవర్మణానికి పాల్పడ్డారని, భర్తతో పాటే తను కూడా అంత్యక్రియలు నిర్వహించాలంటూ రాసి ఉన్న ఓ నోట్ దొరికిందని చెప్పారు. మంగళవారం ఎయిమ్స్​లో ఉండగా దీప్​ మరణం గురించి తెలిసి షాక్​ గురయ్యారని, ఆ తర్వాత గెస్ట్ హౌస్​కు వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

బుధవారం సాయంత్రం రేణు తన్వర్ మృతదేహాన్ని ఆగ్రా తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఎయిర్​ పోర్స్ కాంపౌండ్​లో ఉంచారు. గురువారం మృతదేహాలను కుటుంబ సభ్యులు బిహార్​ తీసుకెళ్లనున్నారని పేర్కొన్నారు. భార్యాభర్తల ఆత్మహత్యకు గల కారణలపై పోలీసులతో పాటు ఎయిర్​ ఫోర్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

NOTE: 'అన్నింటికీ బలవన్మరణ పరిష్కారం కాదు' - ఎవరికైనా అలాంటి ఆలోచనలు ఉంటే స్నేహ ఫౌండేషన్​ -04424640050కు కాల్​ చేయండి. 24x7 అందుబాటులో ఉంటుంది. సోషల్​ సైన్సెస్​ హెల్ప్​లైన్ -9152987821(సోమవారం - శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది)

ABOUT THE AUTHOR

...view details