తెలంగాణ

telangana

'రాహుల్​కు ముప్పు- బీజేపీ నేతల వ్యాఖ్యలే నిదర్శనం'- కాంగ్రెస్ పోలీస్​ కంప్లైంట్ - Congress complaint On NDA Leaders

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2024, 1:57 PM IST

Congress Police complaint On NDA Leaders : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ముప్పు ఉందంటూ కాంగ్రెస్‌ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్​డీఏ నాయకులు చేసిన బెదిరింపు వ్యాఖ్యలే అందుకు కారణమని తెలిపారు. మరోవైపు, రాహుల్​ భద్రతపై కేంద్రం చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు.

Congress Police complaint On NDA Leaders
Congress Police complaint On NDA Leaders (ANI)

Congress Police complaint On NDA Leaders :లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీకి ముప్పు ఉందంటూ దిల్లీ పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. రాహుల్‌ గాంధీని లక్ష్యంగా చేసుకుని అధికార NDA నేతలు చేస్తున్న వ్యాఖ్యలే అందుకు నిదర్శనమంటూ దిల్లీ తుగ్లక్‌ రోడ్డు పోలీస్‌ స్టేషన్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అజయ్‌ మాకెన్‌ ఫిర్యాదు చేశారు. జమ్ముకశ్మీర్‌, హరియాణా ఎన్నికల వేళ దేశంలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలనే ఉద్దేశంతో రాహుల్‌పై దాడికి కుట్ర చేస్తున్నారని మాకెన్‌ పేర్కొన్నారు. శివసేన ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌, బీజేపీ నేతలు తర్వీందర్‌ సింగ్‌ మేర్వా, రావ్‌నీత్‌సింగ్‌ భిట్టు, రఘురాజ్‌ సింగ్‌ రాహుల్‌పై చేసిన వ్యాఖ్యలు ఆయన భద్రతపై అనుమానాలు కలిగిస్తున్నాయని మాకెన్‌ తన ఫిర్యాదులో వివరించారు.

మౌనంగా ఉండకుంటే ఇందిరా గాంధీకి పట్టిన గతే మీకూ పడుతుందంటూ రాహుల్‌ను ఉద్దేశించి ఈనెల 11న తర్వీందర్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలను మాకెన్‌ తన ఫిర్యాదులో అజయ్‌ పేర్కొన్నారు. అలాగే రాహుల్‌ నాలుకను కోసి తెస్తే రూ.11లక్షలు ఇస్తానంటూ శివసేన నేత సంజయ్‌ గైక్వాడ్‌ చేసిన వ్యాఖ్యలు రాహుల్‌కు ఉన్న ముప్పును సూచిస్తున్నాయని మాకెన్‌ వివరించారు. ఈ ఫిర్యాదుపై వెంటనే FIR నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ ఇప్పటికే దేశం కోసం తమ ప్రాణాలు త్యాగం చేశారని, ఈ పరిస్థితుల్లో రాహుల్‌కు హెచ్చరికలను పంపుతున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలని మాకెన్‌ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మైనారిటీల సంక్షేమంపై రాహుల్‌ మాట్లాడుతుంటే ఓర్వలేకే BJP నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని మాకెన్‌ విమర్శించారు.

రాహుల్​ భద్రతకు కేంద్రం చర్యలు తీసుకోవాలి : స్టాలిన్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెదిరింపులు వస్తున్నాయంటూ మీడియాలో వస్తున్న వార్తలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకు రక్షణ కల్పించేందుకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. "మీ నానమ్మకు పట్టిన గతే మీకు పడుతుంది" అని ఒక బీజేపీ నాయకుడు రాహుల్​ గాంధీని బెదిరించినట్లు వార్తలు చదవి దిగ్భ్రాంతికి గురయ్యా. శివసేన శిందే వర్గం ఎమ్మెల్యే రాహుల్​ నాలుకను కత్తిరిస్తే బహుమానం ప్రకటించడం, ఇతర బెదిరింపులు చూసి షాక్​కు గురయ్యా. నా సోదరుడు రాహుల్​కు పెరుగుతున్న​ చరిష్మా, ప్రజల మద్దతు చాలా మందిని అశాంతికి గురిచేసింది, ఇలాంటి నీచమైన బెదిరింపులకు దారితీసింది. ప్రతిపక్ష నాయకుడికి రక్షణ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో బెదిరింపులు, హింసకు స్థానిం లేదని పనురద్ఘాటించాలి" అని స్టాలిన్​ ఎక్స్​లో ట్వీట్​ చేశారు.

'కొందరు దేశాన్ని డివైడ్​ చేయాలనుకుంటున్నారు- అది వారి అజ్ఞానం'- రాహుల్​పై జగదీప్​ ధన్​ఖడ్​ ఫైర్! - Vice President Jagdeep Dhankar

వారికి మద్దతివ్వడం రాహుల్‌కు అలవాటు- కాంగ్రెస్​వి చీల్చే రాజకీయాలు:అమిత్​ షా - Amit Shah on Rahul Gandhi

ABOUT THE AUTHOR

...view details