AAP Punjab Specific Model :అతి తక్కువ కాలంలోనే జాతీయ పార్టీ హోదాను పొందిన ఆమ్ ఆద్మీ పార్టీకి తాజా దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనేక రాష్ట్రాల్లో 'దిల్లీ మోడల్'ను ప్రచారం చేసుకున్న ఆ పార్టీకి ఇప్పుడది పునరాలోచనలో పడేసింది. ఈ క్రమంలో పంజాబ్లో మాత్రమే అధికారంలో ఉన్న ఆప్నకు తన విధానం మార్చుకునే పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీ పనితీరును మెరుగుపరచుకోవాలంటే పంజాబ్లో నిర్దిష్ట అభివృద్ధి మోడల్పై దృష్టి సారించాల్సిందేనని సూచిస్తున్నారు.
ప్రజల తిరస్కరణకు గురైన ఆప్ నేతలు చెప్పిన దిల్లీ మోడలే ప్రస్తుతం పంజాబ్లో అమలు అవుతోంది పంజాబ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ షాహీద్ భగత్ పేర్కొన్నారు. దిల్లీ ప్రజలే దీనికి మద్దతు ఇవ్వకపోతే, ఇంకా పంజాబ్లో ఎలా మద్దతు లభిస్తుందని చెప్పారు. దిల్లీలో ఆప్ అనుసరించిన విధానానికి ఎలాంటి ఫలితం వచ్చిందో, అదే మోడల్ను అమలు చేస్తున్న పంజాబ్కు అదే పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ ఛైర్మన్ ప్రమోద్ కుమార్ అన్నారు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే పంజాబ్లో నిర్దిష్ట ప్రణాళిక అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. పంజాబ్లో దిల్లీ మోడల్ పనిచేయదనే పాఠాన్ని వాళ్లు నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు.