thumbnail

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 2:27 PM IST

ETV Bharat / Videos

Woman Dead Body carried On Doli : డబ్బుల్లేక డోలీలో శ్మశానానికి మృతదేహం తరలింపు.. కంటతడి పెట్టిస్తున్న వైరల్​ వీడియో

Woman Dead Body carried On Doli : మృతదేహాన్ని తరలించడానికి డబ్బులు లేక డోలీలో శ్మశాన వాటికకు తరలిచింది ఓ నిరుపేద కుటుంబం. సోషల్​ మీడియాలో వైరల్​ అయిన ఈ హృదయ విదారక ఘటన దృశ్యాలు కంటతడి పెట్టుస్తున్నాయి. ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​లో శుక్రవారం జరిగిందీ ఈ ఘటన.

ఇదీ జరిగింది..  
ప్రయాగ్​రాజ్​లోని సంగమనగరిలో రోడ్డు పక్కన గుడారంలో ఓ సంచార కుటుంబం నివసిస్తోంది. అందులో నఖ్రు అనే వ్యక్తి భార్య అనిత శుక్రవారం చనిపోయింది. మృతదేహాన్ని తరలించడానికి ఆ నిరుపేద కుటుంబం వద్ద డబ్బులు లేవు. తెలిసిన వారు కూడా సహాయం చేయలేదు. దీంతో డోలీలో మృతదేహాన్ని మోస్తూ శ్మశాన వాటికకు బయలుదేరారు. దీన్ని గమనించిన స్థానికులు ఝాన్సీ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్​ఐ నవీన్​సింగ్.. వారికి ఆర్థిక సహాయం చేశారు. ఇది చూసి స్థానికులు కూడా ఆ నిరుపేద కుటుంబానికి అత్యక్రియల నిమిత్తం రూ.ఐదున్నర వేలు విరాళాలు ఇచ్చారు. దీంతో పాటు మృతదేహాన్ని తరలించడానికి ఆటో రిక్షా ఏర్పాటు చేశారు. వారికి ఆర్థిక సాయం కోసం మరికొంత మొత్తం జమచేశారు. అయితే ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను 'ఈటీవీ భారత్' ధ్రువీకరించలేదు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.