సీఎం కేసీఆర్​పై - గజ్వేల్​లో చెరుకు రైతుల నామినేషన్లు

By ETV Bharat Telangana Team

Published : Nov 8, 2023, 6:47 PM IST

thumbnail

Sugarcane Farmers Nomination in Gajwel : రాష్ట్రంలో మూసేసిన మూడు చక్కెర ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ.. కోరుట్ల చెరుకు రైతులు గజ్వేల్​లో నామినేషన్ దాఖలు చేశారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో.. రాష్ట్రంలోని చక్కెర ఫ్యాక్టరీలను పునః ప్రారంభిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోయారని.. దీనిపై నిరసనగా రైతుల తరఫున.. సీఎం కేసీఆర్​పై గజ్వేల్​లో నామినేషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.  

Muthyampet Sugar factory Issue : రైతులకు అన్ని పంటలకు మద్ధతు ధరలను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో.. మిల్లర్లు పెద్ద మొత్తంలో తరుగు తీసుకుంటున్నారన్నారు. రైతులకు అండగా నిలిచి మిల్లర్లపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోందన్నారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కేసీఆర్​కు ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేశారు. గతంలో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డ్ కోసం నామినేషన్ వేశామన్నారు. అదే స్ఫూర్తితో గజ్వేల్​లో నామినేషన్​లు దాఖలు చేసినట్లు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.