బ్యాంకుకు తాళం వేయడం మరిచిపోయిన ఉద్యోగులు.. గమనించిన గ్రామస్థులు.. ఆఖరికి..

By

Published : Jul 2, 2023, 10:22 PM IST

thumbnail

బ్యాంకుకు తాళం వేయడం మరిచిపోయారు ఉద్యోగులు. ఈ విషయం గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై బ్యాంకు ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.  

ఇదీ జరిగింది.. రామనాథపురం జిల్లాలోని పోతకవయాల్ గ్రామంలో వ్యవసాయ సహకార బ్యాంకు ఉంది. ఎప్పటి లాగానే శనివారం బ్యాంకుకు వచ్చిన ఉద్యోగులు రోజంతా పని చేశారు. బ్యాంకు పని వేళలు ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లే సమయంలో తాళం వేయడం మరిచిపోయారు. రాత్రి 9 గంటల సమయంలో బ్యాంకు సమీపంలోకి వెళ్లిన కొందరు గ్రామస్థులు బ్యాంకు తలుపులు​ తెరిచి ఉండటాన్ని గమనించారు. వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. కొన్ని గంటల తర్వాత అక్కడికి చేరుకున్న అధికారులు.. తాళం వేశారు. అయితే, ఈ ఘటనపై ఆ బ్యాంకు ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా బ్యాంకుకు​​ తాళం వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్యాంకు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.