DTH రీఛార్జ్ కాలేదని దారుణం- షాపు యజమానిపై పిడిగుద్దుల వర్షం, ముగ్గురు యువకులు అరెస్ట్ - ఫతేహాబాద్ క్రైమ్ న్యూస్
🎬 Watch Now: Feature Video


Published : Dec 28, 2023, 12:37 PM IST
Shopkeeper Beaten Video : డీటీహెచ్ రీఛార్జ్ కాలేదని షాపు యజమానిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు ముగ్గురు యువకులు. కొట్టుకుంటూ షాపు యజమానిని బయటకు లాక్కెళ్లారు. అనంతరం షాపును ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు షాపులోని సీసీటీవీలో రికార్డయ్యాయి. దుకాణదారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన హరియాణాలోని ఫతేహాబాద్ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
చాంద్పురా గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు జఖాల్ ప్రాంతంలో ఉన్న ఓ షాపునకు వెళ్లి డీటీహెచ్ రీఛార్జ్ చేయించారు. అయితే ఆ డీటీహెచ్ రీఛార్జ్ కాలేదని కోపోద్రిక్తులైన యువకులు, దుకాణాదారుడిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. కర్రతో షాపులోని వస్తువులను ధ్వంసం చేశారు. అనంతరం అతడిని కొట్టుకుంటూ షాపు బయటకు తీసుకెళ్లారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ ఆ షాపులో అమర్చిన సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వీరు ఉపయోగించిన వాహనం, కర్రను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జఖాల్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ రంజిత్ సింగ్ వివరాలు వెల్లడించారు.