ETV Bharat / state

'ప్రకృతి వైద్యం' పిరం అయింది - పేద రోగులకు అందనంటోంది! - HIGHER FEES NATUROPATHY AMEERPET

అమీర్‌పేట ప్రభుత్వ ప్రకృతి చికిత్సాలయంలో ఫీజులు - ఆధునికీకరణ అనంతరం పెరిగిన ఫీజులతో తగ్గిన రోగులు

Naturopathy In Hyderabad
Higher fees for Naturopathy In Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2025, 12:01 PM IST

Higher fees for Naturopathy In Hyderabad : ప్రభుత్వ ప్రకృతి చికిత్సాలయంలో వైద్య సేవల ధరలు సామాన్యులు, పేదలకు అందకుండా ఉన్నాయి. కొన్ని సేవల ధరలు రెండు, మూడు రెట్లు పెరగడంతో పేద, మధ్య తరగతి రోగులు ఇబ్బందులు పడతున్నారు. దీర్ఘకాలిక రోగాలతో వచ్చే వారికి హైదరాబాద్‌లోని అమీర్‌పేట ప్రభుత్వ ప్రకృతి చికిత్సాలయం సేవలు అందిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి రోగులు వస్తుంటారు. రోగుల్లో ఈ కేంద్రానికి మంచి పేరుంది. అయితే ఎక్కువ మంది సామాన్య, మధ్య తరగతి రోగులే ఈ చికిత్సాలయానికి వస్తారు. కానీ ప్రస్తుతం పెంచిన ఛార్జీలు భారంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పలు వ్యాధులకు ఇక్కడ వైద్యం : క్యాన్సర్, గుండెకు సంబంధించిన వ్యాధులతో పాటు పలు జీవన శైలి వ్యాధులకు ప్రకృతి చికిత్సతో అమీర్​పేటలో వైద్యం అందిస్తారు. థైరాయిడ్, మధుమేహం, స్థూలకాయం, చర్మవ్యాధులు, మెడ, నడుము, కీళ్ల నొప్పులు, కీళ్లవాతం, జీర్ణకోశ, శ్వాసకోశ వ్యాధులు, మానసిక ఒత్తిడి, నిద్ర లేమి, మల బద్ధకం వంటి వాటికీ ఇక్కడ ప్రకృతి చికిత్స అందిస్తారు. గర్భిణులు సాధారణ ప్రసవం అయ్యేలా యోగా, వ్యాయామాలు చేయిస్తుంటారు.

ప్రకృతి చికిత్సాలయంలో చికిత్స భారం : స్త్రీ, పురుషుల్లో నెలకొన్న సంతానోత్పత్తి, గర్భధారణ వంటి సమస్యలకు చికిత్స అందిస్తారు. ఆసుపత్రిలో ఎలాంటి రసాయనాల చికిత్స, ఆపరేషన్లు ఉండవు. వ్యాధి తీవ్రతను బట్టి వారం నుంచి నెలల పాటు చికిత్స చేస్తారు. మట్టి, జల, మర్దన, ఆహార చికిత్సలు, తానాబాత్, డీలక్స్‌ హైడ్రో మసాజ్, యోగా, ప్రాణాయామం, ధ్యాన క్రియలు, వాయు చికిత్స, సూర్యకిరణ్‌ చికిత్స, ఆథపత్‌ (వివిధ రకాల ఆకులను వేడి నీటిలో మరిగించి చేసే స్నానం), షట్‌కర్మల చికిత్స, వివిధ రకాల ఫిజియోథెరఫీలు, ఆక్యూపంచర్‌ వంటివి అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

ఫీజులు పెంచడంతో తగ్గిన రోగులు : ఆసుపత్రిని ఇటీవల రూ.10 కోట్ల నిధులతో ఆధునికీకరించారు. అనంతరం రెండు, మూడింతలు ఫీజులు పెంచడంతో రోగుల రాక తగ్గింది. వైద్యానికి జనరల్‌ వార్డులో వారానికి గతంలో రూ.2500 వసూలు చేస్తే ప్రస్తుతం రూ.9,600కి పెంచారు. తెల్ల రేషన్‌కార్డు ఉంటే గతంలో వారానికి కేవలం రూ.వెయ్యితో చికిత్స అందిస్తే దానిని రూ.3,600 చేశారు. రోగులకు ఇచ్చే డైట్‌ గతంలో రోజుకు రూ.100 ఉంటే, రూ.300 చేశారు. ప్రత్యేక వార్డు ఏసీ షేరింగ్‌ గతంలో రూ.9 వేలు ఉంటే దానిని ఏకంగా రూ.13,700 చేశారు. ఇక ప్రత్యేక కాటేజీ కావాలంటే వారానికి రూ.23,500 చెల్లించాల్సిందే. ఇది రెండింతలు పెరిగింది. ఇలా అన్ని సేవల ధరలు భారీగా పెంపుతో పేద రోగులకు ఇబ్బందిగా మారింది. మానవీయ కోణంలో పేదలకు రాయితీలు ఇవ్వాలని రోగులు కోరుతున్నారు.

తల్లి, ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసిన క్షణికావేశం

క్యాన్సర్‌ బాధితులు మనోధైర్యంతో ఉంటే కచ్చితంగా కోలుకుంటారు : బాలకృష్ణ

Higher fees for Naturopathy In Hyderabad : ప్రభుత్వ ప్రకృతి చికిత్సాలయంలో వైద్య సేవల ధరలు సామాన్యులు, పేదలకు అందకుండా ఉన్నాయి. కొన్ని సేవల ధరలు రెండు, మూడు రెట్లు పెరగడంతో పేద, మధ్య తరగతి రోగులు ఇబ్బందులు పడతున్నారు. దీర్ఘకాలిక రోగాలతో వచ్చే వారికి హైదరాబాద్‌లోని అమీర్‌పేట ప్రభుత్వ ప్రకృతి చికిత్సాలయం సేవలు అందిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి రోగులు వస్తుంటారు. రోగుల్లో ఈ కేంద్రానికి మంచి పేరుంది. అయితే ఎక్కువ మంది సామాన్య, మధ్య తరగతి రోగులే ఈ చికిత్సాలయానికి వస్తారు. కానీ ప్రస్తుతం పెంచిన ఛార్జీలు భారంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పలు వ్యాధులకు ఇక్కడ వైద్యం : క్యాన్సర్, గుండెకు సంబంధించిన వ్యాధులతో పాటు పలు జీవన శైలి వ్యాధులకు ప్రకృతి చికిత్సతో అమీర్​పేటలో వైద్యం అందిస్తారు. థైరాయిడ్, మధుమేహం, స్థూలకాయం, చర్మవ్యాధులు, మెడ, నడుము, కీళ్ల నొప్పులు, కీళ్లవాతం, జీర్ణకోశ, శ్వాసకోశ వ్యాధులు, మానసిక ఒత్తిడి, నిద్ర లేమి, మల బద్ధకం వంటి వాటికీ ఇక్కడ ప్రకృతి చికిత్స అందిస్తారు. గర్భిణులు సాధారణ ప్రసవం అయ్యేలా యోగా, వ్యాయామాలు చేయిస్తుంటారు.

ప్రకృతి చికిత్సాలయంలో చికిత్స భారం : స్త్రీ, పురుషుల్లో నెలకొన్న సంతానోత్పత్తి, గర్భధారణ వంటి సమస్యలకు చికిత్స అందిస్తారు. ఆసుపత్రిలో ఎలాంటి రసాయనాల చికిత్స, ఆపరేషన్లు ఉండవు. వ్యాధి తీవ్రతను బట్టి వారం నుంచి నెలల పాటు చికిత్స చేస్తారు. మట్టి, జల, మర్దన, ఆహార చికిత్సలు, తానాబాత్, డీలక్స్‌ హైడ్రో మసాజ్, యోగా, ప్రాణాయామం, ధ్యాన క్రియలు, వాయు చికిత్స, సూర్యకిరణ్‌ చికిత్స, ఆథపత్‌ (వివిధ రకాల ఆకులను వేడి నీటిలో మరిగించి చేసే స్నానం), షట్‌కర్మల చికిత్స, వివిధ రకాల ఫిజియోథెరఫీలు, ఆక్యూపంచర్‌ వంటివి అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

ఫీజులు పెంచడంతో తగ్గిన రోగులు : ఆసుపత్రిని ఇటీవల రూ.10 కోట్ల నిధులతో ఆధునికీకరించారు. అనంతరం రెండు, మూడింతలు ఫీజులు పెంచడంతో రోగుల రాక తగ్గింది. వైద్యానికి జనరల్‌ వార్డులో వారానికి గతంలో రూ.2500 వసూలు చేస్తే ప్రస్తుతం రూ.9,600కి పెంచారు. తెల్ల రేషన్‌కార్డు ఉంటే గతంలో వారానికి కేవలం రూ.వెయ్యితో చికిత్స అందిస్తే దానిని రూ.3,600 చేశారు. రోగులకు ఇచ్చే డైట్‌ గతంలో రోజుకు రూ.100 ఉంటే, రూ.300 చేశారు. ప్రత్యేక వార్డు ఏసీ షేరింగ్‌ గతంలో రూ.9 వేలు ఉంటే దానిని ఏకంగా రూ.13,700 చేశారు. ఇక ప్రత్యేక కాటేజీ కావాలంటే వారానికి రూ.23,500 చెల్లించాల్సిందే. ఇది రెండింతలు పెరిగింది. ఇలా అన్ని సేవల ధరలు భారీగా పెంపుతో పేద రోగులకు ఇబ్బందిగా మారింది. మానవీయ కోణంలో పేదలకు రాయితీలు ఇవ్వాలని రోగులు కోరుతున్నారు.

తల్లి, ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసిన క్షణికావేశం

క్యాన్సర్‌ బాధితులు మనోధైర్యంతో ఉంటే కచ్చితంగా కోలుకుంటారు : బాలకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.