Jagtial Rains News : గర్భిణీ ప్రసవ వేదన.. జేసీబీ సాయంతో వాగు దాటింపు - jagtial rain updates
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-07-2023/640-480-19110859-922-19110859-1690452332191.jpg)
జగిత్యాల జిల్లాలోని అన్ని ప్రాంతాల రహదారులు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. వరద ఉప్పొంగుతుండటంతో వంతెనల మీదుగా రాకపోకలు కష్టతరంగా మారాయి. ఈ క్రమంలోనే మేడిపల్లి మండలం రాజలింగంపేట గ్రామానికి చెందిన ఓ గర్భిణీకి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గ మధ్యలో ఉన్న వాగు మీదుగా వరద నీరు పొంగి పొర్లుతుండటంతో.. ఆ వాగు దాటి ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. బాధిత కుటుంబసభ్యులు వెంటనే సర్పంచ్కు సమాచారం అందించారు. గ్రామ సర్పంచ్ సకాలంలో స్పందించి.. జేసీబీ సాయంతో గర్భిణీని వాగు దాటించి ఆసుపత్రికి పంపించేలా చొరవ తీసుకున్నారు. వాగు అవతలి వైపు సిద్దంగా ఉన్న అంబులెన్స్లో గర్భిణీని కోరుట్ల హాస్పిటల్కు తరలించారు.
ఇదిలా ఉండగా.. గత 3 రోజులుగా రాష్ట్రంలో వానలు ఎడతెరపి లేకుండా దంచికొడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలో వర్షాలపై పర్యవేక్షిస్తున్నామని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని ఆయన సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే 100కు సమాచారం అందించాలన్నారు.