thumbnail

By

Published : Aug 8, 2023, 9:51 PM IST

ETV Bharat / Videos

Prathidwani : ఎన్డీయే కూటమా? ఇండియా కూటమా? లోక్​సభలో రాజుకున్న రాజకీయ వే'ఢీ'

Prathidwani : ఎన్డీయే ప్రభుత్వంపై విపక్ష కూటమి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో వాడీవేడిగా ప్రారంభమైంది చర్చ. జులై 20వ తేదీన ప్రారంభమైన పార్లమెంట్​ సమావేశాలు.. ఇంకా జరుగుతున్నాయి. మణిపూర్​ ఘర్షణలపై ప్రత్యేక చర్చలపై విపక్షాలు పట్టుపట్టాయి. చివరకు అవిశ్వాసం వరకు విపక్షాల కూటమి వెళ్లింది. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై చర్చలో భాగంగా ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు.

అయితే.. సంఖ్యాబలం పరంగా చూస్తే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పూర్తి ఆధిక్యం కలిగి ఉంది. అది తెలిసి కూడా ప్రతిపక్షాలు అవిశ్వాసం తీర్మానం పెట్టడానికి కారణం ఏమిటి? అసలు విపక్షాలు ఈ చర్చ ద్వారా ఏం ఆశిస్తున్నాయి? మణిపుర్‌లో జాతుల వైరం అపరిష్కృతంగా ఎందుకుంది? మణిపూర్ మంటలను చల్లార్చి.. అక్కడ శాంతిస్థాపన దిశగా ఈ మొత్తం పరిణామాలు ఓ పరిష్కారం చూపిస్తాయని ఆశించవచ్చా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.