Navaratri Celebrations in Telangana : ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.. వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న అమ్మవారు

By ETV Bharat Telangana Team

Published : Oct 19, 2023, 8:04 PM IST

thumbnail

Navaratri Celebrations in Telangana : రాష్ట్రవ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులకు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు. దుర్గామాత నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమోగుతున్నాయి. ఓరుగల్లు శ్రీభద్రకాళి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు పల్లకీ సేవ, వాహన సేవ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.  

Dussehra Festival Celebrations in Telangana : భద్రాచలంలోని రాములోరి క్షేత్రంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు.. ధాన్యలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం మహా నివేదన అనంతరం.. భక్తులు కుంకుమార్చన జరిపారు.  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. అమ్మవారు మహాలక్ష్మి రూపంలో భక్తులను కరుణించారు. కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. ఆదిలాబాద్‌లో తీరొక్క నైవేద్యాలను దుర్గమాతకు సమర్పించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.