thumbnail

By

Published : Apr 26, 2023, 5:08 PM IST

ETV Bharat / Videos

గన్​తో క్లాస్​లో హల్​చల్​.. 80 మంది విద్యార్థులు హడల్.. చివరకు..

తుపాకీతో ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశించిన ఓ దుండగుడు విద్యార్థులను తరగతి గదిలో బంధించి భయభ్రాంతులకు గురిచేసిన ఘటన బంగాల్​ రాష్ట్రంలోని మాల్దా జిల్లాలో జరిగింది. తన భార్యను, కుమారుడిని ఎవరో అపహరించారని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ అతడు బీభత్సం సృష్టించాడు. విద్యార్థులను చంపుతానంటూ బెదిరింపులకు దిగాడు.

దేవ్‌ వల్లభ్​ అనే వ్యక్తి తన భార్య రీటా వల్లభ్, కుమారుడు రుద్ర వల్లభ్ కనిపించట్లేదని ఏడాది క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయినా వారు పట్టించుకోకపోవడం వల్ల దేవ్‌ పాఠశాల కిటికీ నుంచి తరగతిలోకి ప్రవేశించాడు. పాఠాలు చెబుతుండగా వచ్చిన ఆ వ్యక్తి బ్యాగు నుంచి పిస్టోల్‌ బయటకు తీసి బెదిరింపులకు దిగాడని టీచర్‌ తెలిపారు. తొలుత అది బొమ్మ తుపాకీ అనుకున్నట్లు వివరించారు. ఆ సమయంలో తరగతిలో 80 మంది విద్యార్థులు ఉన్నారని.. వారు భయంతో ఏడుస్తుంటే చంపుతానని బెదిరించినట్లు చెప్పారు. రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్నారు. దీంతో ఘటనా స్థలిలో ఉన్న అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ చర్యకు పాల్పడిన దేవ్​ వల్లభ్​ ముచ్చియాలోని నెమువా గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతడి భార్య రీటా వల్లభ్​ మాల్దా గ్రామ పంచాయతీ సమితికి చెందిన బీజేపీ సభ్యురాలు. తన భార్య, కుమారుడిని ఎవరో అపహరించారంటూ.. వారిని వెతికి పెట్టాల్సిందిగా కొన్ని నెలల క్రితం సోషల్​ మీడియాలో పోస్టులు కూడా పెట్టాడు వల్లభ్​. అంతేకాకుండా పిస్టల్​తో అధికారులను బెదిరిస్తున్నట్లుగా వీడియో షేర్​ చేశాడు. అనంతరం అతడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇటీవలే బెయిల్​పై బయటకు వచ్చాడు దేవ్​ వల్లభ్​. మొత్తంగా కుటుంబ సభ్యులను కోల్పోవడం వల్ల అతడు కొంత మానసికంగా కుంగిపోయాడని పోలీసులు చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.