thumbnail

By

Published : Nov 4, 2022, 8:05 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

ETV Bharat / Videos

ఐఐటీ హైదరాబాద్​ విద్యార్థుల నూతన ఆవిష్కరణ.. ఏమిటో మీరు చూడండి?

IIT HYDERABAD: సిమెంట్​, మైక్రో సిలికా, ఇసుక, వాటర్​, స్టీల్​ ఫైబర్​ వంటి స్థానికంగా లభించే పదార్థాలతో ఐఐటీ హైదరాబాద్​ సివిల్​ ఇంజినీరింగ్​ పరిశోధక విద్యార్థుల బృందం సరళమైన ప్రత్యేక కాంక్రీట్​ను అభివృద్ధి చేశారు. అల్ట్రా హై పెర్ఫార్మెన్స్​ ఫైబర్​ రీన్​ఫోర్స్​ కాంక్రీట్​(యూహెచ్​పీఎఫ్​ఆర్​సీ)గా దీనిని పిలుస్తున్నారు. అతి తక్కువ ధరకు దొరికేలా.. సిమెంట్​, ఫైబర్​ వాడకాన్ని తగ్గించడంలో భాగంగా ఈ ప్రయోగం చేశారు. మనం ఉపయోగించే కాంక్రీట్​ మిశ్రమం కన్నా ఎంతో నాణ్యత, ప్రామాణికంగా ఉంటుంది. ఐఐటీ హైదరాబాద్​లో అభివృద్ధి చేయబడిన యూహెచ్​పీఎఫ్​ఆర్​సీ ధర వాణిజ్యపరంగా లభించే యాజమాన్య ఉత్పత్తుల కంటే దాదాపు రెండు రెట్లు తక్కువగా ఉంటోందని పరిశోధకులు తెలిపారు.“ఏ దేశ సమగ్ర అభివృద్ధికి బలమైన, ఎక్కువ మన్నికైన మౌలిక సదుపాయాలు తప్పనిసరి అని ఐఐటీహెచ్​ ప్రొఫెసర్​ బీఎస్​ మూర్తి తెలిపారు. స్థానికంగా లభించే ముడి పదార్థాలను ఉపయోగించి మెరుగైన శక్తితో నిర్మాణ సామగ్రిని అభివృద్ధి చేయడం అనేది మన ఆత్మ నిర్భర్ భారత్ కల సాకారానికి గొప్ప ముందడుగని ఆయన పేర్కొన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.