24వేల మంది విద్యార్థులతో 15కి.మీ మానవహారం- మోదీ కోసమే!

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2023, 5:53 PM IST

thumbnail

Human Chain Formed By Students : గుజరాత్​లోని సూరత్​లో 24 వేల మంది విద్యార్థులతో 15 కి.మీ భారీ మానవహారం ట్రయల్​ రన్​ను శుక్రవారం విజయవంతగా నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్​ మార్కెట్​ను ప్రారంభించేందుకు డిసెంబర్​ 17న మోదీ రానున్నారు. ఈ నేపథ్యంలో మోదీకి వినూత్నంగా స్వాగతం పలికేందుకు సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ మానవహారం కార్యక్రమం తలపెట్టారు.

సూరత్ నగరంలోని 30 బ్లాక్​ల పరిధిలోని అన్ని కళాశాల, పాఠశాలకు చెందిన 24 వేల విద్యార్థులను ఈ మానవహారం ట్రయల్​రన్​ కార్యక్రమంలో భాగంచేశారు. శుక్రవారం పోలీస్​ గ్రౌండ్​ నుంచి జోగాని మాత ఆలయం వరకు విద్యార్థులతో పదిహేను కిలోమీటర్ల మేర మానవహారం నిర్వహించారు నగరపాలక అధికారులు. స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వారు వెల్లడించారు. విద్యార్థులంతా మానవహారంగా ఏర్పడి స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుజరాత్​ హోం మంత్రితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.