ETV Bharat / state

ప్రయాణికులకు గుడ్ న్యూస్ - కేవలం రూ.99కే హైదరాబాద్​ టు విజయవాడ ప్రయాణం - HYDERABAD TO VIJAYAWADA FLIXBUS

హైదరాబాద్​ నుంచి విజయవాడ మధ్య ఫ్లిక్​బస్సులు - అందుబాటులోకి తీసుకొచ్చిన ఫ్లిక్స్​బస్​ ఇండియా- జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Hyderabad to Vijayawada Flixbus
Hyderabad to Vijayawada Flixbus (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 7, 2025, 7:10 AM IST

Hyderabad to Vijayawada Flixbus : తెలంగాణ ప్రభుత్వం విద్యుత్​ వాహనానలును ప్రోత్సహిస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈటీవో మోటార్స్​తో ఫ్లిక్స్​ బస్​ ఇండియా అందుబాటులోకి తెచ్చిన విద్యుత్తు బస్సులను గురువారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.

విజయవాడ నుంచి విశాఖ మధ్య ప్రారంభిస్తాం : ఈటీవో మోటార్స్​ సీఎంవో వైఎస్​ఆర్ రాజీవ్​, ఫ్లిక్స్​ బస్ ఇండియా ఎండీ సూర్య ఖురానా మాట్లాడుతూ మూడు, నాలుగు వారాల తర్వాత హైదరాబాద్​-విజయవాడ మధ్య ఈవీ బస్సులు నడుస్తాయని తెలిపారు. తదుపరి విజయవాడ - విశాఖ మధ్య ప్రారంభిస్తామని చెప్పారు. సేవలు ప్రారంభమైన తర్వాత నాలుగు వారాల పాటు రూ.99తో హైదరాబాద్​ నుంచి విజయవాడకు ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు. అయిదు గంటల్లో హైదారాబద్​ నుంచి విజయవాడకు చేరుతాయన్నారు. అన్ని ప్రభుత్వ పథకాలు తమ బస్సుల్లోనూ వర్తిస్తాయని వివరించారు. 49 మంది ప్రయాణించే సదుపాయం ఉందని, రానున్న రోజుల్లో స్లీపర్​ కోచ్​లతో మరిన్ని బస్సులను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

Hyderabad to Vijayawada Flixbus : తెలంగాణ ప్రభుత్వం విద్యుత్​ వాహనానలును ప్రోత్సహిస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈటీవో మోటార్స్​తో ఫ్లిక్స్​ బస్​ ఇండియా అందుబాటులోకి తెచ్చిన విద్యుత్తు బస్సులను గురువారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.

విజయవాడ నుంచి విశాఖ మధ్య ప్రారంభిస్తాం : ఈటీవో మోటార్స్​ సీఎంవో వైఎస్​ఆర్ రాజీవ్​, ఫ్లిక్స్​ బస్ ఇండియా ఎండీ సూర్య ఖురానా మాట్లాడుతూ మూడు, నాలుగు వారాల తర్వాత హైదరాబాద్​-విజయవాడ మధ్య ఈవీ బస్సులు నడుస్తాయని తెలిపారు. తదుపరి విజయవాడ - విశాఖ మధ్య ప్రారంభిస్తామని చెప్పారు. సేవలు ప్రారంభమైన తర్వాత నాలుగు వారాల పాటు రూ.99తో హైదరాబాద్​ నుంచి విజయవాడకు ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు. అయిదు గంటల్లో హైదారాబద్​ నుంచి విజయవాడకు చేరుతాయన్నారు. అన్ని ప్రభుత్వ పథకాలు తమ బస్సుల్లోనూ వర్తిస్తాయని వివరించారు. 49 మంది ప్రయాణించే సదుపాయం ఉందని, రానున్న రోజుల్లో స్లీపర్​ కోచ్​లతో మరిన్ని బస్సులను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

'6 వరుసలుగా హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి - అప్పటి నుంచే పనులు ప్రారంభం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.