thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2024, 7:53 PM IST

ETV Bharat / Videos

గీతం యూనివర్సిటీలో ఐదో అంతస్తు నుంచి దూకి బీటెక్ విద్యార్థిని బలవన్మరణం - వీడియో వైరల్

Gitam University Student Suicide in Hyderabad : ఇప్పుడు విద్యార్థులు ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. తల్లిదండ్రులు తిట్టినా, ఎవరైనా ఏదైనా అన్నా, ప్రేమికుడితో గొడవలు జరిగినా ఇలా ప్రతి చిన్న విషయానికి మరణమే శరణ్యంగా భావించి ప్రాణాలనే విడిచిపెడుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా రుద్రారం గీతం విశ్వవిద్యాలయంలో బీటెక్‌ చదువుతున్న విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. కళాశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గీతం కళాశాల మొత్తం ఉలిక్కి పడేలా చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం గీతం యూనివర్సిటీలో బీటెక్‌ తొలి ఏడాది చదువుతున్న విద్యార్థిని మధ్యాహ్నం సమయంలో ఫోన్‌లో మాట్లాడుకుంటా భవనం పైకి ఎక్కింది. ఐదో అంతస్తులో ఫోన్‌ పక్కన పెట్టి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. నేరుగా కాకుండా భవనం పిట్ట గోడను పట్టుకొని వేలాడుతూ కిందకు దూకేసింది. దీంతో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.