thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2023, 12:25 PM IST

ETV Bharat / Videos

Farmers Fight Over Farm Path Video Viral : పొలం బాట విషయంలో ఘర్షణ.. ఒకరు మృతి.. వీడియో వైరల్​

Farmers Fight Over Farm Path Video Viral in Suryapet : పొలం బాట విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ ఓ వ్యక్తి ప్రాణాలు బలి తీసుకుంది. ఈ ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ నియోజకవర్గం చింతల పాలెంలోని  పొలం బాట విషయంలో ఇరువర్గాల మధ్య రెండు రోజుల క్రితం ఘర్షణ జరిగింది. ఈ గొడవల్లో గుగులోతు వాచ్యా అనే వ్యక్తి కుటుంబంపై విచక్షణారహితంగా మరో వర్గం వారు దాడికి తెగబడ్డారు 

Argument in Land Issue Suryapet : ఈ దాడిలో గుగులోతు వాచ్యా తలకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో  హైదరాబాద్​లోని గాంధీ హాస్పిటల్​కు తరలించారు. చికిత్స పొందుతున్న వాచ్యా.. ఈరోజు ఉదయం సుమారు మూడు గంటల సమయంలో మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు, ఒక బాలుడు ఉన్నారు. ఈ దాడిలో గాయాలైన మిగిలిన వారిని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. గొడవ పడిన విజువల్స్​ సీసీ కెమెరాల్లో చిక్కాయి. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.