యశోద ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ - నందినగర్ నివాసానికి తీసుకెళ్లిన కేటీఆర్, హరీశ్​రావు

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2023, 12:33 PM IST

Updated : Dec 15, 2023, 3:40 PM IST

thumbnail

Ex CM KCR Discharge From Hospital : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనను బంజారాహిల్స్‌లోని నందినగర్‌ నివాసానికి కేటీఆర్, హరీశ్‌రావు తీసుకెళ్లారు. ప్రతి రోజు యశోద నుంచి నందినగర్ వెళ్లి కేసీఆర్​కు వైద్యులు ఫిజియోథెరపీ చేయనున్నారు. వైద్యులు వారం రోజుల తరువాత మరో మారు కేసీఆర్(KCR) ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తారు.

అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు : తుంటి మార్పిడి శస్త్రచికిత్స అనంతరం తన తండ్రి, బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ యశోద ఆసుపత్రి నుంచి క్షేమంగా డిశ్చార్జ్​ అయ్యారని ఎమ్మెల్సీ కవిత ఎక్స్​(X) వేదికగా పేర్కొన్నారు. కేసీఆర్​ త్వరగా కోలుకోవడానికి మెరుగైన చికిత్స అందించిన వైద్యులు, నర్సులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. కష్టసమయంలో దేశవ్యాప్తంగా కేసీఆర్​కు ప్రేమాభిమానం దక్కిందని కవిత అన్నారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కుటుంబానికి, తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఎక్స్​ వేదికగా ఎమ్మెల్సీ కవిత కృతజ్ఞతలు తెలిపారు.

ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కాలు జారి పడడంతో వారం రోజుల క్రితం కేసీఆర్‌(KCR) ఆసుపత్రిలో చేరారు. డాక్టర్ ఎంవీ రావు ఆధ్వర్యంలో వివిధ విభాగాలకు చెందిన వైద్యుల బృందం పరీక్షల అనంతరం కేసీఆర్​కు శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించింది. ఆయనకు తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. ఈ క్రమంలో ఆయనను కలవడానికి సీఎం రేవంత్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆసుపత్రికి వచ్చారు.

Last Updated : Dec 15, 2023, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.