షిరిడీ ఆలయానికి భక్తుడు విరాళం - బంగారు పుష్పం అందజేత

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 8:11 PM IST

thumbnail

Donations to Shirdi Saibaba Temple: షిరిడీ సాయిబాబాకు భక్తులు కానుకలు సమర్పిస్తున్నారు. ఈరోజు ఒడిశాకు చెందిన ఓ భక్తుడు బంగారు పుష్పం సమర్పించగా, టీవీఎస్​ కంపెనీ డీలర్​ ఓ ద్విచక్రవాహనాన్ని సాయినాథుడికి అందజేశారు. ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన భక్తుడు శంభునాథ్ సవాయ్ షిరిడీ సాయినాథుడికి కానుక సమర్పించారు. దత్త జయంతి సందర్భంగా షిర్డీ సాయిబాబా సంస్థాన్‌కు 82.870 గ్రాముల బంగారు పుష్పాన్ని విరాళంగా అందజేశారు.  4 లక్షల 77 వేల రూపాయల విలువైన బంగారు పుష్పాన్ని సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తుకారాం హులావ్లేకు అందజేశారు. 

టీవీఎస్​ కంపెనీ అపాచీ 310 స్పోర్ట్స్ బైక్​కు సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం  కోపర్‌గావ్‌లోని TVS కంపెనీ డీలర్ వీరేంద్ర భండార్కర్ దాదాపు మూడున్నర లక్షల విలువైన ద్విచక్ర వాహనాన్ని ఆలయానికి అందజేశారు. ఇప్పటివరకు తాము 10 మోటార్​ సైకిళ్లు, ఒక త్రీవీలర్​ సాయినాథుడికి అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్బంగా కానుకలు సమర్పించన భక్తులకు సాయిబాబా విగ్రహం, శాలువాతో ఆలయ సిబ్బంది సత్కరించారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.