thumbnail

Constable Rescues a Passenger : రైలు ఎక్కబోతూ జారిపడిన ప్రయాణికుడు.. కాపాడిన కానిస్టేబుల్

By

Published : Apr 28, 2023, 2:36 PM IST

Constable Rescues a Passenger in Gadwal district: రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు కిందపడిన ఓ ప్రయాణికుడిని రైల్వే కానిస్టేబుల్‌ కాపాడారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల రైల్వే స్టేషన్​లో ఈ సంఘటన చోటుచేసుకుంది. గురువారం రాత్రి సికింద్రాబాద్ నుంచి కర్నూల్ వెళుతున్న హంద్రీ ఎక్స్​ప్రెస్ గద్వాల రైల్వే స్టేషన్​కు చేరుకుంది. రైల్వే స్టేషన్​ నుంచి రైలు బయలుదేరుతున్న క్రమంలో గద్వాల పట్టణానికి చెందిన షరీఫ్ ట్రైన్ ఎక్కే క్రమంలో కిందకు జారిపడ్డాడు. 

షరీఫ్ ప్రమాదవశాత్తు జారి రైలు కింద పడుతున్న సమయంలో అక్కడే డ్యూటీలో ఉన్న రైల్వే కానిస్టేబుల్ నాగరాజు అప్రమత్తమయ్యారు. వెంటనే షరీఫ్​ను పక్కకు లాగడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. షరీఫ్ ప్రాణాలు కాపాడిన రైల్వే కానిస్టేబుల్ నాగరాజును ఉన్నతాధికారులు అధికారులు, ప్రయాణికులు అభినందించారు. 

రైలు ప్రయాణం చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులకు రైల్వే అధికారులు సూచించారు. రైలు ఎక్కినప్పుడు సమయపాలన పాటించాలని తెలిపారు. రైలు కదులుతున్న సమయంలో ట్రైన్​కు దూరంగా ఉండాలని, రైలు ఆగిన తర్వాతే ఎక్కాలని ప్రయాణికులకు సూచించారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.