'ఎన్నికల్లో కాంగ్రెస్ 80కి పైగా సీట్లలో గెలవడం ఖాయం' - కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కామెంట్స్
🎬 Watch Now: Feature Video


Published : Nov 7, 2023, 8:05 PM IST
Congress Leader Komati Reddy Venkat Reddy Nomination : రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. నాలుగు రోజు కూడా జోరుగా అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ఈ క్రమంలో నల్గొండ ఆర్డీఓ కార్యాలయంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నామినేషన్ వేశారు. అనంతరం బీఆర్ఎస్పై విమర్శలు(Komati Reddy Comments on BRS) చేశారు. నామినేషన్ వేసే ముందు నల్గొండ వీటి కాలనీలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత కార్యకర్తలు, నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయాన్ని చేరుకుని.. తన నామినేషన్ పత్రాలను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ 80కి పైగా సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు.
"తెలంగాణ వచ్చాక.. కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ది పొందింది. 2018లో దత్తత పేరుతో నల్గొండ ప్రజలను మోసగించారని మరోసారి మోసపోవద్దు. 30న పోలింగ్ ఉంది.. అందుకే 27 నుంచి మీ అకౌంట్లోకి రుణమాఫీ, రైతు బంధు డబ్బులు వస్తాయి. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న1200 మందికి న్యాయం జరగలేదు. కేసీఆర్ డిసెంబర్ 3న రాజీనామా చేస్తారు. డిసెంబరు 9న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తొంది."- కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి