ఒక్కసారిగా బస్లో చెలరేగిన మంటలు.. లోపల 25 మంది ప్రయాణికులు.. - గుజరాత్ అహ్మదాబాద్ న్యూస్
🎬 Watch Now: Feature Video

గుజరాత్ అహ్మదాబాద్లో పెను ప్రమాదం తప్పింది. మేమ్నగర్ బీఆర్టీఎస్ బస్టాండ్లో ఓ బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది.. మూడు ఫైరింజన్లు తీసుకొచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. మేమ్నగర్ బస్టాండ్ దగ్గరకి వచ్చేసరికి బస్సు రిపేర్ అయింది. కాసేపటికే బస్సు నుంచి పొగలు వచ్చాయి. దీంతో వెంటనే బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులను కిందకు దించి ఆర్టీసీ సిబ్బంది కాపాడారు. శుక్రవారం జరిగిందీ ఘటన.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST