thumbnail

By

Published : Jul 15, 2023, 7:51 PM IST

ETV Bharat / Videos

మున్సిపల్​ అధికారుల నిర్లక్ష్యం.. బైక్​తో సహా కాలువలో పడ్డ వ్యక్తి.. లక్కీగా..

Biker Fell In Drainage : ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడు.. బైక్​తో సహా మురికి కాలువలో పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతడిని ప్రాణాలతో కాపాడారు. పంజాబ్​లోని లుధియానాలో ఈ ఘటన జరిగింది.
అసలేం జరిగిందంటే?
లుధియానాలోని కోట్ మంగళ్ సింగ్​ నగర్​ ప్రాంతంలో మున్సిపల్​ కార్పొరేషన్ అధికారులు.. మురికి కాలువ నిర్మాణ పనులు చేపట్టారు. పనులు ముగిసి చాలా రోజులైనా పైన మూత వేయలేదు. అయితే శుక్రవారం రాత్రి.. మసాన్​ బాచి జాన్​ అదే ప్రాంతానికి బైక్​పై వెళ్లాడు. ప్రమాదవశాత్తు మురికి కాలువలో ద్విచక్ర వాహనంతో సహా పడిపోయాడు.  

మసాన్​ పడిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. యువకుడిని బయటకు లాగారు. కాలువ లోతుగా ఉండడం వల్ల మోటార్ సైకిల్ లోపలికి వెళ్లిపోయింది. తాళ్ల సహాయంతో బైక్​ను బయటకు తీశారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

మున్సిపల్​ కార్పొరేషన్​ అధికారుల నిర్లక్ష్యం వల్లే యువకుడు.. మురికి కాలువలో పడిపోయాడని స్థానికులు అంటున్నారు. వెంటనే కాలువపై మూత ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. మసాన్​.. పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని అన్నారు. మురికి కాలువ తెరిచి ఉండడం వల్ల ఓ వైపు రోగాలు వస్తున్నాయని.. మరోవైపు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.