అన్నం పెట్టిన వ్యక్తికి కొండముచ్చు కన్నీటి నివాళి - కొండముచ్చు వైరల్ వీడియో
🎬 Watch Now: Feature Video

చనిపోయిన వ్యక్తి తల పక్కన కూర్చుని ఓ కొండముచ్చు నివాళులు అర్పిస్తున్న వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సంఘటన శ్రీలంకలోని బాటికలోవాలో జరిగిందని తెలుస్తోంది. రోజూ ఆ కొండముచ్చుకు ఆయన ఆహారం పెట్టేవారని స్థానికులు చెబుతున్నారు. తనకు రోజూ అన్నం పెట్టిన వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడని భావిస్తోంది ఆ కొండముచ్చు. అందుకే ఆయనను లేపి కూర్చోబెట్టేందుకు చాలా ప్రయత్నిస్తోన్న విషయం వీడియో చూస్తే అర్ధమవుతోంది. ఆహారం పెట్టే వ్యక్తుల పట్ల విశ్వాసం చూపించడం అంటే ఇదేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST