కరోనా ఎఫెక్ట్​: నిత్యావసరాల కోసం యూకే వాసుల పాట్లు - నిత్యావసరాల కోసం యూకే వాసుల పాట్లు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 16, 2020, 4:49 AM IST

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బ్రిటన్​ వాసులు పాస్తా, బియ్యం, టాయిలెట్​ పేపర్లు లాంటి నిత్యావసర వస్తువుల కోసం దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ముందు జాగ్రత్తగా ప్రజలు అధిక మొత్తంలో వస్తువులను కొనుగోలు చేస్తుండడం వల్ల సూపర్ మార్కెట్లు దాదాపుగా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇతర యూరప్​ దేశాల మాదిరిగా బ్రిటన్ విద్యాలయాలను మూసివేయలేదు. పరిస్థితి క్షీణిస్తే మాత్రం వచ్చే వారాంతంలో ప్రజలు గుంపులుగా చేరకుండా బహిరంగ సమావేశాలు నిషేధం విధించాలని భావిస్తోంది. ఇప్పటివరకు బ్రిటన్​లో కరోనా వల్ల 21 మంది మృతి చెందగా.. మరో 1,140 మంది వ్యాధి బారిన పడ్డారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.